ఆగస్టు 22వ తేదీన రాఖీ పౌర్ణమి కావడంతో దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ,అక్కా తమ్ముళ్లు ఎంతో సంతోషంగా రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అన్న తన చెల్లితో రాఖీ కట్టించుకోవడం కోసం ఆమె ఇంటికి వెళ్లి తనతో ఎంతో సంతోషంగా రాఖీ కట్టించుకుని తన చెల్లికి బహుమతి అందించి తిరిగి ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్తున్న అన్నకు ఫోన్ వచ్చింది. అవతలి వారు చెప్పిన వార్త విని ఆ అన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తను సంతోషంగా ఉండాలని తన చేతికి రాఖీ కట్టిన ఆ చెల్లి ఇక ఎప్పటికీ తిరిగి రానీ లోకాలకు వెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఉష అనే యువతి గత రెండు సంవత్సరాల క్రితం ఫణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తుండగా.. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాఖీ పండుగ కావడంతో తన అన్న సూర్యనారాయణ తన చెల్లి ఇంటికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాఖీ కట్టించుకుని ఆమెకు విలువైన బహుమతి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు.
ఈ క్రమంలోనే సూర్యనారాయణ మార్గమధ్యంలో ఉండగా తన అత్తింటివారి నుంచి తన చెల్లి చనిపోయిందని వార్త రావడంతో సూర్యనారాయణ కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి వెళ్లి చూడటంతో తన చెల్లెలు విగతజీవువిగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన చెల్లి ఇలా చనిపోవడానికి గల కారణం కేవలం తన అత్తింటివారని ఉష తల్లిదండ్రులు వారిపై పోలీస్ కేసు నమోదు చేశారు. అయితే తను ఇంట్లో ఉన్న ఫలంగా కళ్ళుతిరిగి పడిపోతే ఆస్పత్రికి తరలించామని ఫణి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…