టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన “లెజెండ్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తన రెండవ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ హీరోగా కన్నా విలన్ గానే ఎన్నో మంచి విజయాలను అందుకుంటున్నారు.
నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వంటి సినిమాల్లో విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జగపతి బాబు రాజ మన్నార్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ క్రమంలోనే జగపతి బాబు రాజ మన్నార్ పాత్రకి సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు నత్తుతో పాటు నోటిలో సిగార్లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…