కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లికి కామంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించింది. ఈ క్రమంలోనే తరుచూ తన వివాహేతర బంధానికి తన కొడుకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి అభంశుభం తెలియని ఆ చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించి చిన్నారిని చంపిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ అహ్మదాబాద్ జ్యోతి అజయ్ అనే దంపతులకు మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయితే జ్యోతి భరత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే కూరగాయలు తీసుకురావడానికి అని తన కొడుకును తీసుకుని ఇంటినుంచి బయటకు వెళ్ళిన జ్యోతి కూరగాయలు కొనకుండా ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళింది. అక్కడ తన ప్రియుడు భరత్ తో కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పిల్లాడు ఏడవడంతో ఎంతో చికాకు పడ్డాడు. ఎప్పుడు ఏంటి నసా మనిద్దరి మధ్య అంటూ విసుక్కోవడంతో జ్యోతి కూడా తన కొడుకు పట్ల ఎంతో అసహనం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఆ చిన్నారిని చంపేయాలని ప్లాన్ చేశారు. అప్పుడే జ్యోతి పాలలో పురుగుమందు కలిపి బాబుకు పట్టించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం కూరగాయలు తీసుకొని జ్యోతి ఇంటికి వెళ్లి బాబును పడుకోబెట్టి తన పనిలో నిమగ్నమైంది. అంతలో తన మనవడితో ఆడుకోవడం కోసం వచ్చిన తాత ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉండటం గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.దీంతో పోస్ట్ మార్టం నిర్వహించగా పిల్లాడి కడుపులో పురుగుల మందు అవశేషాలు కనిపించడంతో పోలీసులు తల్లిని కస్టడీలోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…