సృష్టిలో తల్లి అంటే అందరికీ ఎంతో గౌరవం ఉంటుంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లి దృష్టిలో వారు మంచివారుగానే ఉంటారు. అంటే.. తల్లిప్రేమ అలా ఉంటుందని అర్థం. ఆ ప్రేమకు వెలకట్టలేం. కానీ ఆ కసాయి తల్లి మాత్రం కన్ను మిన్నూ కానకుండా ప్రవర్తించింది. తన వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుందని తన కన్న కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. అందుకు ఆమెకు తన తల్లి కూడా సహకరించడం విశేషం. తల్లి, అమ్మమ్మ కలిసి ఆ చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్ కాలనీలో వడ్డె యాదమ్మ (30), రాములు అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి 2011 లో వివాహం అయింది. నలుగురు పిల్లలు జన్మించారు. కానీ అనారోగ్యం కారణంగా వారిలో ఇద్దరు చనిపోయారు. ఈ క్రమంలో వారు 2013లో శివాజీ నగర్ అనే మరో కాలనీకి మకాం మార్చారు. అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే యాదమ్మ, రాములు ఇద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కానీ గత 3 ఏళ్లుగా యాదమ్మ మద్యానికి బానిస అయింది. విపరీతంగా కల్లు తాగేది. ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తుండేది. ఈ క్రమంలో భర్త రాములు ఆమెను విడిచి పెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. దీంతో యాదమ్మ తన తల్లి తిమ్మమ్మ, కుమార్తె కృష్ణవేణి (5)తో కలిసి నివసిస్తోంది.
అయితే ఇతర వ్యక్తులతో తాను కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలకు తన కుమార్తె కృష్ణ వేణి (5) అడ్డు వస్తుందని భావించిన యాదమ్మ ఆ పాపను చంపేందుకు పథకం వేసింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమార్తె కృష్ణవేణిని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. తరువాత యాదమ్మ తల్లి తిమ్మమ్మ అక్కడకు వచ్చింది. కానీ తన మనవరాలిని చంపినందుకు తన కుమార్తెను ఆమె పోలీసులకు పట్టించలేదు. పైగా ఆ నేరాన్ని పక్కనే నివాసం ఉంటున్న ఇంకో వ్యక్తి మీద నెట్టబోయారు. అయితే విషయం తెలుసుకున్న రాములు చందానగర్కు వచ్చి తన భార్య యాదమ్మ, అత్త తిమ్మమ్మలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేసి విచారించారు. ఈక్రమంలో వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…