క్రైమ్‌

దారుణం.. వివాహేత‌ర సంబంధాల‌కు అడ్డు వ‌స్తుంద‌ని.. క‌న్న కూతుర్ని గొంతు నులిమి చంపేసిన క‌సాయి త‌ల్లి..

సృష్టిలో త‌ల్లి అంటే అంద‌రికీ ఎంతో గౌర‌వం ఉంటుంది. పిల్ల‌లు ఎన్ని త‌ప్పులు చేసినా త‌ల్లి దృష్టిలో వారు మంచివారుగానే ఉంటారు. అంటే.. త‌ల్లిప్రేమ అలా ఉంటుంద‌ని అర్థం. ఆ ప్రేమ‌కు వెలక‌ట్ట‌లేం. కానీ ఆ క‌సాయి త‌ల్లి మాత్రం క‌న్ను మిన్నూ కాన‌కుండా ప్ర‌వ‌ర్తించింది. త‌న వివాహేత‌ర సంబంధాల‌కు అడ్డు వ‌స్తుంద‌ని త‌న క‌న్న కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. అందుకు ఆమెకు త‌న త‌ల్లి కూడా స‌హ‌క‌రించ‌డం విశేషం. త‌ల్లి, అమ్మ‌మ్మ క‌లిసి ఆ చిన్నారి ప్రాణాలను బ‌లి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

హైద‌రాబాద్‌లోని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో శాంతిన‌గ‌ర్ కాల‌నీలో వ‌డ్డె యాద‌మ్మ (30), రాములు అనే దంప‌తులు నివాసం ఉండేవారు. వీరికి 2011 లో వివాహం అయింది. న‌లుగురు పిల్ల‌లు జ‌న్మించారు. కానీ అనారోగ్యం కార‌ణంగా వారిలో ఇద్ద‌రు చ‌నిపోయారు. ఈ క్ర‌మంలో వారు 2013లో శివాజీ న‌గ‌ర్ అనే మ‌రో కాల‌నీకి మ‌కాం మార్చారు. అక్క‌డ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే యాద‌మ్మ‌, రాములు ఇద్ద‌రూ కూలి ప‌నులు చేస్తూ జీవ‌నం సాగించేవారు. కానీ గ‌త 3 ఏళ్లుగా యాద‌మ్మ మ‌ద్యానికి బానిస అయింది. విప‌రీతంగా క‌ల్లు తాగేది. ఇత‌ర వ్య‌క్తుల‌తో వివాహేత‌ర సంబంధాల‌ను కొన‌సాగిస్తుండేది. ఈ క్ర‌మంలో భ‌ర్త రాములు ఆమెను విడిచి పెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. దీంతో యాద‌మ్మ త‌న త‌ల్లి తిమ్మ‌మ్మ‌, కుమార్తె కృష్ణ‌వేణి (5)తో క‌లిసి నివసిస్తోంది.

అయితే ఇత‌ర వ్య‌క్తుల‌తో తాను కొన‌సాగిస్తున్న వివాహేత‌ర సంబంధాల‌కు త‌న కుమార్తె కృష్ణ వేణి (5) అడ్డు వస్తుంద‌ని భావించిన యాద‌మ్మ ఆ పాపను చంపేందుకు ప‌థ‌కం వేసింది. గురువారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో కుమార్తె కృష్ణ‌వేణిని గొంతు నులిమి ఊపిరి ఆడ‌కుండా చేసి చంపేసింది. త‌రువాత యాద‌మ్మ త‌ల్లి తిమ్మ‌మ్మ అక్క‌డ‌కు వ‌చ్చింది. కానీ త‌న మ‌న‌వరాలిని చంపినందుకు త‌న కుమార్తెను ఆమె పోలీసుల‌కు ప‌ట్టించ‌లేదు. పైగా ఆ నేరాన్ని ప‌క్క‌నే నివాసం ఉంటున్న ఇంకో వ్య‌క్తి మీద నెట్ట‌బోయారు. అయితే విష‌యం తెలుసుకున్న రాములు చందాన‌గ‌ర్‌కు వ‌చ్చి త‌న భార్య యాద‌మ్మ‌, అత్త తిమ్మ‌మ్మ‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని వారిని అరెస్టు చేసి విచారించారు. ఈక్ర‌మంలో వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితుల‌ను రిమాండ్ కు త‌ర‌లించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM