తన కూతురికి 4 నెలల క్రితం కట్న కానుకలు ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి అత్తవారింటికి సాగనంపారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే భార్య భర్తల మధ్య కలహాలు మొదలవడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించే తన కూతురు, అల్లుడికి సర్ది చెబుదామని వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటికి చేరుకోగా వారు రావడంతో ఆందోళన చెందిన వరుడు గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేవుని పల్లి గ్రామానికి చెందిన రఘు వర్ధన్ అనే యువకుడికి భిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామానికి చెందిన రవళితో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. వీరి వివాహ సమయంలో కట్నకానుకలను ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ కూతురు, అల్లుడికి సర్ది చెబుదామని అత్తమామలు వరుడి ఇంటికి వచ్చారు. అయితే వారిని చూసిన వరుడు ఎంతో కంగారు పడుతూ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రఘు వర్ధన్ ని చూసిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పెళ్లయిన 4 నెలలకే తన భర్తను అలా చూడటంతో రవళి కన్నీరుమున్నీరైంది. ఈ క్రమంలోనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…