వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలు చెబుతుంటారు. అంటే పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు.. వారికి ఉన్న సమస్యలు, అనారోగ్యాల గురించి అబద్దం ఆడమని కాదు, ఇతర అంశాల్లో అబద్దాలు ఆడైనా పెళ్లి చేయాలని చెబుతారు. అయితే వారు మాత్రం ఆ యువకుడికి ఉన్న అనారోగ్య సమస్యల గురించి నిజాలను దాచి పెళ్లి చేశారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఆ యువకుడు ఏడాది తిరగకముందే చనిపోయాడు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన ఊహా రెడ్డితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి సంబంధం కుదరడంతో ఊహ తన జీవితం గురించి ఎన్నో కలలు కనింది. అయితే ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. తన భర్తకు కిడ్నీ సమస్యలు ఉన్నాయనే విషయం తన అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారని తెలియడంతో బాధను దిగమింగుకుని అతనితో కాపురం చేసింది.
ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి కొద్దిరోజులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు చెయ్యి పడిపోయింది. ఈ బాధను భరించలేక విజయేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. తను మరణించేటప్పటికి ఊహ ఆరు నెలల గర్భిణీ. ఈ విధంగా ఒక అబద్ధం వల్ల తన జీవితం మొత్తం నాశనం అయిందని తనకు కూతురు పుట్టిన తర్వాత న్యాయం చేయాలంటూ అత్తవారింటిని ఆశ్రయించిన ఊహకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయింది. అత్తమామలు తనకు న్యాయం చేయకపోగా ఆమె కుటుంబంపై ఎదురుదాడి దిగి కర్రలతో కొట్టారు. దీంతో ఆమె పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…