కేవలం చేతబడి చేస్తున్నాడన్న అనుమానం రావడంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు స్వయాన అల్లుడు అయినటువంటి వ్యక్తి చేతిలో మామ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ విధంగా మామను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి పొలంలో పని చేస్తున్న తన భార్యకోసం భోజనం తీసుకుని వెళుతున్నాడు. అయితే తన మామ చేతబడి చేస్తూ తమ కుటుంబాన్ని నాశనం చేయదలచాడని, అదే గ్రామానికి చెందిన కొండ తామర నారప్ప అనే యువకుడు ఎలాగైనా తన మామకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే పొలం వద్దకు తన భార్యకు భోజనం తీసుకెళ్తున్న ఉత్తరను చంపడానికి ఇదే అనువైన సమయమని భావించిన నారప్ప అతనిని వెంబడించాడు.
ఈ క్రమంలోనే ఉత్తర తన చెర నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీసిన తన మామను గ్రామానికి దూరంలో ఉన్న ఒక జీడి తోటలో తలపై బలంగా కొట్టడంతో ఉత్తర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఈ సంఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే తన మామకి దహన సంస్కరణలు నిర్వహించాడు. ఈ విధంగా తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని అతని కుమారులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితుడు బయటపడటంతో అతనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…