కేవలం చేతబడి చేస్తున్నాడన్న అనుమానం రావడంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు స్వయాన అల్లుడు అయినటువంటి వ్యక్తి చేతిలో మామ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ విధంగా మామను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి పొలంలో పని చేస్తున్న తన భార్యకోసం భోజనం తీసుకుని వెళుతున్నాడు. అయితే తన మామ చేతబడి చేస్తూ తమ కుటుంబాన్ని నాశనం చేయదలచాడని, అదే గ్రామానికి చెందిన కొండ తామర నారప్ప అనే యువకుడు ఎలాగైనా తన మామకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే పొలం వద్దకు తన భార్యకు భోజనం తీసుకెళ్తున్న ఉత్తరను చంపడానికి ఇదే అనువైన సమయమని భావించిన నారప్ప అతనిని వెంబడించాడు.
ఈ క్రమంలోనే ఉత్తర తన చెర నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీసిన తన మామను గ్రామానికి దూరంలో ఉన్న ఒక జీడి తోటలో తలపై బలంగా కొట్టడంతో ఉత్తర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఈ సంఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే తన మామకి దహన సంస్కరణలు నిర్వహించాడు. ఈ విధంగా తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని అతని కుమారులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితుడు బయటపడటంతో అతనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…