పెళ్లిళ్లు చేసుకుని హాయిగా, సంతోషంగా సాగిపోతున్న భార్యా భర్తల జీవితాల్లోకి మూడవ వ్యక్తి రావడంతో ఆ జీవితం చెల్లాచెదురు అయింది.ఈ క్రమంలోనే భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న భార్య భర్తల మధ్య వివాదాలు తలెత్తుతూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విధమైన వార్తలు ఎన్నింటినో మనం చదివి ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.
కాప్రాలోని వంపుగూడకు చెందిన ఓ మహిళ (48) తన భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది. గత 10 సంవత్సరాల క్రితం ఆమె ఒక హోటల్ లో పని చేసింది. కాగా ఆ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు తనకన్నా వయసులో 12 సంవత్సరాల చిన్నవాడైన అశోక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విధంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. సదరు మహిళతో కలిసి జీవించడం కోసం అశోక్ మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఈ విషయం అశోక్ భార్యకు తెలియడంతో తన భర్తను నిలదీసింది. దీంతో ఆమె అశోక్ కు దూరమైంది. అయితే ఆమె మరొకరికి దగ్గర కావడాన్ని అతను చూసి ఓర్చుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తనని ఎలాగైనా చంపాలని పథకం వేసిన అశోక్ ఐదవ తేదీ తనని రూమ్ కి రమ్మని ఫోన్ చేశాడు. అశోక్ నుంచి ఫోన్ రాగానే.. చికెన్ తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే అశోక్ పై అనుమానాలు వ్యక్త పరచగా పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అసలు విషయం బయట పడింది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనని గొంతునులిమి చంపానని అశోక్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…