పెళ్లిళ్లు చేసుకుని హాయిగా, సంతోషంగా సాగిపోతున్న భార్యా భర్తల జీవితాల్లోకి మూడవ వ్యక్తి రావడంతో ఆ జీవితం చెల్లాచెదురు అయింది.ఈ క్రమంలోనే భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న భార్య భర్తల మధ్య వివాదాలు తలెత్తుతూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విధమైన వార్తలు ఎన్నింటినో మనం చదివి ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.
కాప్రాలోని వంపుగూడకు చెందిన ఓ మహిళ (48) తన భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది. గత 10 సంవత్సరాల క్రితం ఆమె ఒక హోటల్ లో పని చేసింది. కాగా ఆ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు తనకన్నా వయసులో 12 సంవత్సరాల చిన్నవాడైన అశోక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విధంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. సదరు మహిళతో కలిసి జీవించడం కోసం అశోక్ మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఈ విషయం అశోక్ భార్యకు తెలియడంతో తన భర్తను నిలదీసింది. దీంతో ఆమె అశోక్ కు దూరమైంది. అయితే ఆమె మరొకరికి దగ్గర కావడాన్ని అతను చూసి ఓర్చుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తనని ఎలాగైనా చంపాలని పథకం వేసిన అశోక్ ఐదవ తేదీ తనని రూమ్ కి రమ్మని ఫోన్ చేశాడు. అశోక్ నుంచి ఫోన్ రాగానే.. చికెన్ తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే అశోక్ పై అనుమానాలు వ్యక్త పరచగా పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అసలు విషయం బయట పడింది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనని గొంతునులిమి చంపానని అశోక్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…