పూర్వకాలంలో మన పెద్దలు అమ్మాయిలు దొరక్కపోతే కట్నం ఎదురిచ్చి వివాహం చేసుకునేవారు కదా. అలాగే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కట్నం ఎదురిచ్చి మరీ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులు అంతా సక్రమంగానే జరిగింది. కానీ వధువు మాత్రం పారిపోయింది. దీంతో వరుడికి షాక్ తగిలింది.
రాజస్థాన్లోని భారత్పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా మడార్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జార్ అనే వ్యక్తి ఓ మధ్యవక్తి ద్వారా సునీత అనే మహిళను మార్చి 9వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆమెది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా ఘాటిగావోన్ గ్రామం. ఈ క్రమంలోనే ఆమెకు రూ.3 లక్షలను అతను ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే మార్చి 22వ తేదీన.. అంటే సరిగ్గా పెళ్లయిన 13 రోజులకు సునీత నారాయణ సింగ్ ఇంటి నుంచి పారిపోయింది. ఆ రోజు ఉదయం అతను యథావిధిగా పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె లేదు. దీంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…