పూర్వకాలంలో మన పెద్దలు అమ్మాయిలు దొరక్కపోతే కట్నం ఎదురిచ్చి వివాహం చేసుకునేవారు కదా. అలాగే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కట్నం ఎదురిచ్చి మరీ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులు అంతా సక్రమంగానే జరిగింది. కానీ వధువు మాత్రం పారిపోయింది. దీంతో వరుడికి షాక్ తగిలింది.
రాజస్థాన్లోని భారత్పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా మడార్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జార్ అనే వ్యక్తి ఓ మధ్యవక్తి ద్వారా సునీత అనే మహిళను మార్చి 9వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆమెది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా ఘాటిగావోన్ గ్రామం. ఈ క్రమంలోనే ఆమెకు రూ.3 లక్షలను అతను ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే మార్చి 22వ తేదీన.. అంటే సరిగ్గా పెళ్లయిన 13 రోజులకు సునీత నారాయణ సింగ్ ఇంటి నుంచి పారిపోయింది. ఆ రోజు ఉదయం అతను యథావిధిగా పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె లేదు. దీంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…