పూర్వకాలంలో మన పెద్దలు అమ్మాయిలు దొరక్కపోతే కట్నం ఎదురిచ్చి వివాహం చేసుకునేవారు కదా. అలాగే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కట్నం ఎదురిచ్చి మరీ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులు అంతా సక్రమంగానే జరిగింది. కానీ వధువు మాత్రం పారిపోయింది. దీంతో వరుడికి షాక్ తగిలింది.
రాజస్థాన్లోని భారత్పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా మడార్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జార్ అనే వ్యక్తి ఓ మధ్యవక్తి ద్వారా సునీత అనే మహిళను మార్చి 9వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆమెది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా ఘాటిగావోన్ గ్రామం. ఈ క్రమంలోనే ఆమెకు రూ.3 లక్షలను అతను ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే మార్చి 22వ తేదీన.. అంటే సరిగ్గా పెళ్లయిన 13 రోజులకు సునీత నారాయణ సింగ్ ఇంటి నుంచి పారిపోయింది. ఆ రోజు ఉదయం అతను యథావిధిగా పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె లేదు. దీంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…