దారుణం.. అదనపు కట్నం కోసం భార్యతో యాసిడ్ తాగించిన భర్త..

July 23, 2021 7:26 PM

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు వరకట్న వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు అనే యువకుడికి శశి అనే యువతితో 5 నెలల క్రితం వివాహం జరిగింది.వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సుమారు 10 లక్షల మేర ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయిన ఐదు నెలలకే వీరేంద్ర కొత్త కారు కొనాలని అందుకోసం తమ తల్లిదండ్రుల వద్ద మరో మూడు లక్షల రూపాయలు కట్నం తేవాలని శశిని వేధించేవాడు.ఈ క్రమంలోనే ఆమె పెళ్లి కోసమే తమ తల్లిదండ్రులు ఎంతో అప్పు చేశారని మరి కట్నం కావాలంటే ఎక్కడినుంచి తెస్తారని తన భర్తతో వివాదానికి దిగింది.

ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరి వీరేంద్ర తన భార్య శశిని గొడ్డును బాదినట్టు బాది తన చేత యాసిడ్ తాగించాడు. యాసిడ్ తాగడం వల్ల అపస్మారకస్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు. యాసిడ్ తాగడం వల్ల ఆమె శరీరంలోని భాగాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆమెకు తరచూ రక్తపు వాంతులు అవుతున్నాయని తన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యవహారంపై DCW చీఫ్ స్వాతిమాలివాల్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖరాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment