Cyber Cheating : సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఓ వైపు ఎంత చెబుతున్నా కూడా కొందరు వ్యక్తులు ఇంకా అపరిచితులను నమ్మి మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తిని నమ్మిన ఆ యువతి ఏకంగా లక్షల రూపాయలను పోగొట్టుకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఇటీవలే ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు తనను తాను నితిన్ పటేల్గా పరిచయం చేసుకున్నాడు. తాను యూకేలో ఉంటున్నానని, బ్రిటిష్ ఎయిర్వేస్లో పైలట్గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. అయితే అతనితో ఆమె స్నేహం చేసింది. ఆమె వివరాలను రాబట్టిన అతను ఆమెకు ఓ పార్సిల్ పంపించాడు.
అయితే ఆ పార్సిల్ లాజిస్టిక్స్ వారి వద్ద ఆగిపోయిందని, కస్టమ్స్ ఫీజు చెల్లించాలని ఓ యువతి ఆ ఉద్యోగినికి ఫోన్ కాల్ చేసింది. అది నిజమే అని నమ్మిన ఆ ఉద్యోగిని ముందుగా రూ.55వేలను చెల్లించింది. అయితే ఆమె నుంచి విడతల వారిగా అవతలి వారు అలా డబ్బు వసూలు చేస్తూనే ఉన్నారు. దీంతో మొత్తం ఆమె వారికి రూ.27 లక్షలను అలా చెల్లించింది. అయితే చివరకు తాను మోసపోయానని ఆమె గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో ఎట్టి పరిస్థితిలోనూ స్నేహం చేయవద్దని, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని, కనుక ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…