ప్రస్తుత కాలంలో చాలా మంది బతుకుతెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగానే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో భార్యాభర్తలిద్దరూ పనులు చేస్తూ ఉండగా తన పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్లే వారు. ఈ విధంగా పిల్లలను వదిలి పనికి వెళ్లి వచ్చేసరికి తన 2 సంవత్సరాల కొడుకు మృత్యువాత పడటం చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..
ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రదీప్రావుకు భార్య దుర్గావతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రావు హైదరాబాద్ కి వలస వచ్చి కుత్బుల్లాపూర్ బీహెచ్ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. తన భార్య దుర్గావతి కొందరి ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే పిల్లలను ఆడుకొమ్మనిచెప్పి ఇంటి పనులకు వెళ్లిన దుర్గావతి తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.
తన రెండు సంవత్సరాల కుమారుడు బాత్రూం బకెట్లో పడి ఉండటం చూసి ఆ తల్లి వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలోనే తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…