ప్రస్తుత కాలంలో చాలా మంది బతుకుతెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగానే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో భార్యాభర్తలిద్దరూ పనులు చేస్తూ ఉండగా తన పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్లే వారు. ఈ విధంగా పిల్లలను వదిలి పనికి వెళ్లి వచ్చేసరికి తన 2 సంవత్సరాల కొడుకు మృత్యువాత పడటం చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..
ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రదీప్రావుకు భార్య దుర్గావతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రావు హైదరాబాద్ కి వలస వచ్చి కుత్బుల్లాపూర్ బీహెచ్ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. తన భార్య దుర్గావతి కొందరి ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే పిల్లలను ఆడుకొమ్మనిచెప్పి ఇంటి పనులకు వెళ్లిన దుర్గావతి తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.
తన రెండు సంవత్సరాల కుమారుడు బాత్రూం బకెట్లో పడి ఉండటం చూసి ఆ తల్లి వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలోనే తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…