నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని ఇది వరకు మనకు తెలిసిన విషయమే. అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుకి ప్రాధాన్యత ఉందట. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ పాత్రలో చేయటం కోసం దర్శకుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం చేత డేట్స్ కుదరని కారణంగా బాలకృష్ణ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు దర్శకుడు హీరోయిన్ శృతి హాసన్ ను సంప్రదించగా శృతి కూడా “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత బాలయ్య సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే దర్శకుడు నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అఖండ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…