కరోనా ఎంతోమంది చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పొత్తిళ్లలోనే తల్లిని పోగొట్టుకొని ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ విధంగానే కరోనా సోకిన తల్లి మృతి చెందగా… అప్పుడే పుట్టిన బిడ్డ ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బిడ్డకు కేవలం ఫార్ములా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తల్లులు తమ మానవతా హృదయంతో తమ చనుబాలను ఆ పసిబిడ్డకు తాపించి బిడ్డ ప్రాణాలను కాపాడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగపూర్ లోని కింగ్స్వే హాస్పిటల్లో మినాల్ వెర్నేకర్ అనే 32 సంవత్సరాల గర్భిణీ మహిళ కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. అత్యవసర పరిస్థితులలో ఆమెకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలోనే తల్లికి గుండెల్లో నొప్పి రావడంతో మృతి చెందింది. నెలలు పూర్తి కాకనే శిశువు జన్మించడంతో అతనికి ఫార్ములా పాలు తాపించడంతో అలర్జీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న జన్మించిన తన కుమారుడికి ఆస్పత్రిలో ఉన్నటువంటి ఇతర చిన్న పిల్లల తల్లులు తమ చను పాలను పిండి బాటిల్లో పోసి ఆ బిడ్డకు ఇచ్చే వారు.ఈ సందర్భంగా బిడ్డ తండ్రి చేతన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎంతోమంది మాతృమూర్తుల మానవత్వం వల్లే నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిన సమయంలో కూడా తన బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించడంతో చేతన్ ‘బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా తమ సమస్యను తెలిపాడు. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ చేతన్ బిడ్డకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఇప్పటికీ వివిధ ప్రాంతాలలోని మహిళల దగ్గరనుంచి చనుబాలను ఆ బిడ్డకు అందిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…