కరోనా ఎంతోమంది చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పొత్తిళ్లలోనే తల్లిని పోగొట్టుకొని ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ విధంగానే కరోనా సోకిన తల్లి మృతి చెందగా… అప్పుడే పుట్టిన బిడ్డ ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బిడ్డకు కేవలం ఫార్ములా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తల్లులు తమ మానవతా హృదయంతో తమ చనుబాలను ఆ పసిబిడ్డకు తాపించి బిడ్డ ప్రాణాలను కాపాడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగపూర్ లోని కింగ్స్వే హాస్పిటల్లో మినాల్ వెర్నేకర్ అనే 32 సంవత్సరాల గర్భిణీ మహిళ కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. అత్యవసర పరిస్థితులలో ఆమెకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలోనే తల్లికి గుండెల్లో నొప్పి రావడంతో మృతి చెందింది. నెలలు పూర్తి కాకనే శిశువు జన్మించడంతో అతనికి ఫార్ములా పాలు తాపించడంతో అలర్జీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న జన్మించిన తన కుమారుడికి ఆస్పత్రిలో ఉన్నటువంటి ఇతర చిన్న పిల్లల తల్లులు తమ చను పాలను పిండి బాటిల్లో పోసి ఆ బిడ్డకు ఇచ్చే వారు.ఈ సందర్భంగా బిడ్డ తండ్రి చేతన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎంతోమంది మాతృమూర్తుల మానవత్వం వల్లే నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిన సమయంలో కూడా తన బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించడంతో చేతన్ ‘బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా తమ సమస్యను తెలిపాడు. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ చేతన్ బిడ్డకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఇప్పటికీ వివిధ ప్రాంతాలలోని మహిళల దగ్గరనుంచి చనుబాలను ఆ బిడ్డకు అందిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…