సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా హోలీ పండుగ సందర్భంగా మహేష్ ట్విట్వర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.
అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరం బాధ్యతగా ఉంటూ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాం. ఈ హోలీ మీకు ప్రియమైన వారి నుంచి మరింత ప్రేమను అందించాలి.. అని మహేష్ అన్నాడు.
కాగా సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. ఇక ఇటీవలే మహేష్ కు చెందిన మహర్షి మూవీకి 2 నేషనల్ ఫిలిం అవార్డులు లభించాయి. దీంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట మూవీ తదుపరి షెడ్యూల్ గురించి ఎప్పుడు వార్త చెబుతారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…