ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన అందాల రాక్షసి..!

July 22, 2021 2:19 PM

అందాల రాక్షసి అనగానే అందరికి సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి గుర్తుకువస్తుంది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న లావణ్య త్రిపాటి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. సాధారణంగా సినీ సెలబ్రిటీల జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటారో వారికే తెలియదు. సినిమా షూటింగ్ నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే వేరే ప్రాంతానికి వెళ్ళాలని భావించిన లావణ్య త్రిపాఠి ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణం చివరి సమయంలో పలు సాంకేతిక కారణాల వల్లతాను ప్రయాణించిన విమానం క్యాన్సిల్ కావడంతో లావణ్యత్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ అందాల రాక్షసి..విమానం క్యాన్సిల్ అవుతుందనే విషయాన్ని ముందస్తుగా ఎందుకు చెప్పడంలేదు అంటూ సదరు సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఏషియాని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. విమానం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా వేరే విమానంలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తనకు మెసేజ్ రావడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఈ విధంగా ఎవరికైనా జరిగిందా.. లేదా తనకే మొదటిసారిగా జరిగిందా.. అంటూ ఆమె అభిమానులను అడిగారు. మరి ఈమె ప్రశ్నకు ఎయిర్ ఏషియా సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment