నాపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కోర్టుకు వెళ్తా… నటి రాధిక!

April 9, 2021 5:35 PM

గత కొద్దిరోజుల నుంచి నటి రాధిక పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అంటూ తాజాగా నటి రాధిక స్పందించారు. తనకు కరోనా సోకిందని,తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాధిక ట్విట్టర్ ద్వారా మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదంటూ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అంటూ ఆమె తెలిపారు.

ప్రస్తుతం రాధిక ఆరోగ్యంగానే ఉన్నట్లు, అదే విధంగా ప్రస్తుతం నా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నాను. ఈ క్రమంలోనే నా ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న వారిపై కోర్టుకు వెళ్తానని, కోర్టులో వారిపై న్యాయపోరాటం చేస్తానని రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

గత కొద్దిరోజుల నుంచి రాధిక కరోనా బారినపడ్డట్టు వార్తలు రావడంతో తాజాగా నేడు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించి అసలు విషయం తెలియజేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment