ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటన ద్వారా నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాని నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కరోనా కారణం వల్ల ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. తాజాగా నాని నిర్మాతగా తన బ్యానర్ వాల్పోస్టర్ సినిమాపై నాలుగో సినిమాగా ‘మీట్ క్యూట్’ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నిర్మాతగా వ్యవహరించగా తన అక్క దీప్తి ఘంటా దర్శకురాలిగా పరిచయం కానున్నారు.
తాజాగా నాని నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కాక మరో ఇద్దరు కొత్తవాళ్లను తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ హీరోయిన్స్ ఎవరు ఏమిటి అనే విషయాలను ఒక్కొక్కరినిగా నాని రివీల్ చేస్తూ వస్తారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాను కేవలం 30 రోజుల లోగా పూర్తి చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.నాని నిర్మాణంలో తెరకెక్కె ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి అని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…