ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామరస్ పాత్ర ద్వారా కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నటిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటంటే.. ఈ బ్యూటీ గత నెల 11వ తేదీన పెద్దపల్లి పట్టణంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. ఈ క్రమంలోనే ఈ మాల్ ప్రారంభోత్సవానికి పాయల్ వస్తుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె కరోనా నిబంధనలను పాటించడం లేదని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షాపింగ్ మాల్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ మాస్కు ధరించకుండా, కరోనా నిబంధనలను ఉల్లంఘించిందని ఈ హీరోయిన్ పై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నటి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని పాయల్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…