Bee Farming: స్వచ్ఛమైన తేనె మనకు మార్కెట్లో లభించడం చాలా తక్కువ. ప్యాక్ చేయబడిన తేనె లభిస్తుంది. అయితే తేనెటీగలను పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తే నిజానికి వ్యాపారం బాగానే సాగుతుంది. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువే. అందువల్ల తేనెటీగల పెంపకం ద్వారా మనం నెల నెలా బాగానే ఆదాయాన్ని సంపాదించవచ్చు.
తేనెటీగలను పెంచేందుకు పూలతోటలు ఉండాలి. పూలతోటలు దగ్గర్లో ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతో తేనెటీగలు వేగంగా తేనెను సేకరిస్తాయి. ఇక పువ్వులు అన్నీ మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. కనుక ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పువ్వులు ఏడాది పొడవునా లభించే ప్రాంతాల్లో తేనెటీగలను పెంచాలి. దీంతో తేనె సేకరణకు ఆటంకం ఏర్పడదు.
తేనెటీగలను బాక్సుల్లో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో బాక్సుకు సుమారుగా రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో 50 నుంచి 100 బాక్సులతో మొదట తేనెటీగల పెంపకం చేపట్టవచ్చు. 100 బాక్సులు అయితే ఒక్కో బాక్సుకు రూ.1000 చొప్పున మొత్తం రూ.1 లక్ష పెట్టుబడి అవుతుంది. పువ్వుల తోటలు ఉండే స్థలాన్ని లీజుకు తీసుకోవచ్చు. దీంతో తేనె సేకరణ సులభతరం అవుతుంది. అలాగే ఇతర పరికరాలకు, సామగ్రికి డబ్బులను వెచ్చించాలి. దీంతో రూ.2 లక్షల మేర పెట్టుబడి పెడితే తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించవచ్చు.
తేనెటీగలు సహజంగానే ఒక బాక్సులో తేనెను సేకరించేందుకు సుమారుగా 20 రోజులకు పైగానే సమయం పడుతుంది. అంటే నెల నెలా మనకు తేనె కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో ఒక్క బాక్సు నుంచి నెలకు సుమారుగా 5 కేజీల వరకు తేనె ఉత్పత్తి అవుతుంది. అదే 100 బాక్సులకు అయితే 500 కేజీల తేనె వస్తుంది.
బయట మనం కిలో తేనెను టోకున అమ్మితే రూ.100 నుంచి రూ.150 వరకు వస్తాయి. కానీ మనమే తేనెను ప్యాక్ చేసి అమ్మితే కేజీకి రూ.400 వరకు సంపాదించవచ్చు. దీంతో 500 కేజీల తేనెకు కిలోకు రూ.400 వేసుకున్నా.. రూ.2,00,000 వస్తాయి. అందులో సగం ఖర్చులు తీసినా సగం మిలుగుతాయి. అంటే రూ.1 లక్ష అన్నమాట. నెలకు ఇలా రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చు.
గమనిక: తేనెటీగల పెంపకంపై కేవలం సంక్షిప్త అవగాహన కోసమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం తేనెటీగల పెంపకం శిక్షణా కేంద్రంలో సంప్రదించవచ్చు. ఈ కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…