కరోనా మొదటి వేవ్ మాత్రమే కాదు, సెకండ్ వేవ్ కూడా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. దీని వల్ల చాలా మంది ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కేవలం సాధారణ ప్రజలే కాదు, వ్యాపార వేత్తలు కూడా కరోనా వల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సహాయం చేసేందుకు నడుం బిగించాయి. అందువల్ల మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటుంటే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలోనే చిన్న బిజినెస్ ప్రారంభించవచ్చు. పౌల్ట్రీ వ్యాపారం చేయవచ్చు. దీనికి గాను ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షలతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
పౌల్ట్రీ వ్యాపారం చేయాలంటే ముందుకు మీకు ఓ స్థలం కావాలి. లేయర్ కోళ్లను పెంచుతూ ఈ వ్యాపారం చేస్తే.. 1500 కోళ్లతో మీరు వ్యాపారం ప్రారంభిస్తే నెలకు రూ.50వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదింవచ్చు. ఈ క్రమంలోనే మీకు సామగ్రి కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతో 1500 కోళ్లతో మీరు పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించవచ్చు. తరువాత ఎప్పటికప్పుడు 10 శాతం కోళ్లను పెంచుతూ పోవాలి.
పౌల్ట్రీ వ్యాపారంలో కోడిగుడ్లను అమ్మడం ద్వారా లాభాలు ఎక్కువగా వస్తాయి. కోడిగుడ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కనుక చక్కని ఆదాయం సంపాదించవచ్చు. ఒక్క లేయర్ కోడిపిల్ల ధర రూ.30 అనుకున్నా రూ.50వేలు పెడితే సుమారుగా 1600 పిల్లలు వస్తాయి. దీంతో వాటిని పెంచి గుడ్లను ఉత్పత్తి చేయవచ్చు. వాటికి భిన్న రకాల ఆహారాలను పెట్టాల్సి ఉంటుంది. సమయానికి మందులను ఇవ్వాలి.
కోడిపిల్లలను 20 వారాల పాటు పెంచేందుకు సుమారుగా రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతాయి. ఒక లేయర్ కోడి ఏడాదిలో సుమారుగా 300 గుడ్లను పెడుతుంది. 20 వారాల తరువాత కోళ్లు గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. తరువాత అవి ఏటా గుడ్లను పెడుతుంటాయి.
20 వారాలు పూర్తయ్యే సరికి కోళ్ల పెంపకానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అవుతుంది. ఈ క్రమంలో 1500 కోళ్ల నుంచి సుమారుగా 4,35,000 గుడ్లను తీయవచ్చు. అంటే ఏడాదికి యావరేజ్గా ఒక కోడి నుంచి 290 గుడ్లు వస్తాయన్నమాట.
వేస్టేజ్ పోయినా 4 లక్షల గుడ్లను అమ్మితే ఒక గుడ్డు ధర రూ.5 నుంచి రూ.7 మధ్య ఉంటుంది కనుక ఏడాదిలోనే గుడ్లను అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. సరిగ్గా చేయాలే కానీ ఏడాదిలోనే రూ.30 లక్షల మేర సంపాదించవచ్చు.
పౌల్ట్రీ వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వాల నుంచి 25 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలు అయితే 35 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు. బ్యాంకులు ఈ వ్యాపారం చేసేందుకు లోన్లను కూడా అందిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…