Bank Fraud : బ్యాంకు అకౌంట్‌లోని రూ.9.50 ల‌క్ష‌లు పోయాయి.. రీఫండ్ ఇచ్చేది లేద‌ని చెప్పిన బ్యాంక్‌..!

October 1, 2021 4:13 PM

Bank Fraud : మొబైల్ ఫోన్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల విష‌యంలో మ‌నం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన న‌ష్టాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఓ వ్య‌క్తికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. త‌న స్నేహితుని కార్‌లో త‌న ఫోన్‌, కార్డుల‌ను పెట్టి వేరే చోట‌కు వెళ్లాడు. దీంతో ఫోన్‌, ప‌ర్సును ఎవ‌రో కొట్టేశారు. త‌రువాత అత‌ని బ్యాంక్ అకౌంట్‌లో రూ.9.50 ల‌క్ష‌ల‌ను కాజేశారు. చివ‌ర‌కు బ్యాంకు మాత్రం ఆ డ‌బ్బును వెన‌క్కి తిరిగి ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పింది. వివ‌రాల్లోకి వెళితే..

Bank Fraud : బ్యాంకు అకౌంట్‌లోని రూ.9.50 ల‌క్ష‌లు పోయాయి.. రీఫండ్ ఇచ్చేది లేద‌ని చెప్పిన బ్యాంక్‌..!

ముంబైలోని విక్రోలి అనే ప్రాంతానికి చెందిన ఏర‌త్ అనే 51 ఏళ్ల వ్య‌క్తి ఓ క‌న్స‌ల్టింగ్ సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నాడు. కాగా ఇత‌ను ఆగ‌స్టు 22వ తేదీన అక్క‌డి ఈస్ట‌ర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాంతంలో త‌న స్నేహితుల‌ను క‌లిసేందుకు వెళ్లాడు. అక్క‌డ ఓ స్నేహితుని కార్‌లో త‌న ఫోన్‌, ప‌ర్సును పెట్టి వేరే ద‌గ్గ‌రకు వెళ్లాడు. త‌రువాత వ‌చ్చి చూడా ఫోన్‌, ప‌ర్సు పోయిన‌ట్లు గుర్తించాడు. ప‌ర్సులో అత‌ని డెబిట్‌, క్రెడిట్ కార్డులు అన్నీ ఉన్నాయి.

అయితే ఉద‌యం 7.30 గంట‌ల‌కు అత‌ను తిరిగి వ‌చ్చాక చూసి అవి పోయిన‌ట్లు గుర్తించాడు. కానీ ఫిర్యాదు మాత్రం వెంట‌నే చేయ‌లేదు. ఇదే అత‌ని కొంప ముంచింది. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బ్యాంకు సిబ్బందికి కాల్ చేసి అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించాడు. కార్డుల‌ను బ్లాక్ చేయించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కానీ అప్ప‌టికే న‌ష్టం జ‌రిగిపోయింది. అత‌ని ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.9.50 ల‌క్ష‌ల‌ను కాజేశారు.

ఒక్క వ్య‌క్తే ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డిన‌ట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కానీ అత‌ను మాస్క్ పెట్టుకుని ఉన్నాడ‌ని, అందువ‌ల్ల అత‌న్ని స‌రిగ్గా గుర్తించ‌లేక‌పోతున్నామ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత ఏర‌త్ త‌న డ‌బ్బును రీఫండ్ చేయాల‌ని బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ బ్యాంకు వారు అందుకు నిరాక‌రించారు.

తాము ఏర‌త్‌కు చెందిన అకౌంట్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా అవుతున్న‌ప్పుడు అత‌ని ఫోన్ కాల్ చేసి వెరిఫై చేశామ‌ని, అవ‌త‌లి నుంచి తానే చేస్తున్న‌ట్లు చెప్పాడ‌ని, అందువ‌ల్ల ఈ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేమ‌ని బ్యాంకు వారు తేల్చేశారు. కానీ నిజానికి అత‌ని ఫోన్ కూడా పోయింది. అవ‌తలి వ్య‌క్తి ఏర‌త్ కాదు. దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తి. క‌నుక బ్యాంకు వారు కాల్ చేసినా అత‌నే లిఫ్ట్ చేశాడు కాబ‌ట్టి తానే ఏర‌త్ అని క‌న్‌ఫాం చేశాడు. దీంతో బ్యాంకు వారు కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. అలా అత‌ని నిర్ల‌క్ష్యం కార‌ణంగా రూ.9.50 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now