IPL 2021 : ధోనీ టీమ్ మ్యాజిక్‌.. క్లిష్ట స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ కోలుకుని మ‌రీ ముంబైపై గెలిచారు..!

September 19, 2021 11:26 PM

IPL 2021 : క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ 2021 వాయిదా ప‌డి తాజాగా మ‌ళ్లీ మొద‌లైంది. ఆదివారం నాటి మ్యాచ్‌తో మ‌రోసారి ఐపీఎల్ జోష్ తెచ్చింది. మొద‌టి ద‌శ‌లో 29 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా ఆదివారం 30వ మ్యాచ్ తో మ‌ళ్లీ ఐపీఎల్ ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైలు త‌ల‌ప‌డ‌గా.. విజ‌యం చెన్నైని వ‌రించింది.

IPL 2021 : ధోనీ టీమ్ మ్యాజిక్‌.. క్లిష్ట స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ కోలుకుని మ‌రీ ముంబైపై గెలిచారు..!

టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఓ ద‌శ‌లో 24 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి అత్యంత క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్న చెన్నైని ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర జ‌డేజా, బ్రేవోలు ఆదుకున్నారు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో రుతురాజ్ 88 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, జ‌డేజా 26, బ్రేవో 23 ప‌రుగులు చేశారు. దీంతో చెన్నై చెప్పుకోద‌గిన స్కోరు చేయ‌గ‌లిగింది. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, ఆడ‌మ్ మిల్నె, బుమ్రాల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌ను మాత్ర‌మే చేయ‌గలిగింది. ముంబై బ్యాట్స్‌మెన్‌ల‌లో సౌర‌భ్ తివారీ ఒక్కడే రాణించాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. 40 బంతులు ఆడిన తివారీ 5 ఫోర్ల‌తో 50 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌల‌ర్ల‌లో బ్రేవో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, దీప‌క్ చాహ‌ర్ 2 వికెట్లు తీశాడు. జోష్ హేజ‌ల్‌వుడ్‌, శార్దూల్ ఠాకూర్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలో ముంబైపై చెన్నై 20 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now