పితృ పక్షంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఈ దానాలు తప్పనిసరి..!

September 20, 2021 12:15 PM

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉన్న రోజులను పితృ పక్షాలు అంటారు. ఈ 15 రోజులలో మన ఇంట్లో.. చనిపోయిన మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు పిండప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.

పితృ పక్షంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఈ దానాలు తప్పనిసరి..!

అలాగే చనిపోయిన మన పెద్ద వారి పేరున పూజ చేయించి పిండ ప్రదానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి పితృ దోషాలు తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!

పిండ ప్రదానం చేసిన తర్వాత మన పెద్ద వారి పేరుపై ఇతరులకు నల్లనువ్వులు, వెండి వస్తువులు, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, పాద రక్షలు, గొడుగు, భూమి వంటి వస్తువులను దానం చేయాలి. అయితే ఇవన్నీ తప్పనిసరిగా దానం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ మన స్థోమతకు తగ్గట్టుగా ఉప్పు, బెల్లం, నల్లనువ్వులను దానం చేసినప్పటికీ పితృదేవతలు సంతోషపడి వారి ఆత్మశాంతి పడటమే కాకుండా మనపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment