
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు. ఆలయంలో జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ జంటకు అక్కడి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, దర్శనం అనంతరం ఆ దంపతులను అధికారులు ఆలయ మర్యాదలతో సన్మానించారు. కాగా నాగచైతన్య, శోభిత పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే వీరు ఏదైనా ప్రత్యేక కారణంతో ఆ ఆలయాన్ని దర్శించారా, లేక సాధారణంగానే పర్యటనలో భాగంగా దర్శించుకున్నారా.. అన్న విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
#WATCH | Actor Naga Chaitanya, along with his wife Sobhita Dhulipala, visited the Shree Jagannath Temple at Puri, in Odisha, to seek the blessings of Lord Jagannath.
Actor Naga Chaitanya says, “Jai Jagannath” (06.03) pic.twitter.com/VAhPmVmCpw
— ANI (@ANI) March 6, 2026
పలు సినిమాలతో చైతన్య బిజీ..
నాగచైతన్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన వృషకర్మ సినిమాలో యాక్ట్ చేస్తుండగా దీనికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తండేల్ సినిమా సూపర్హిట్ అయిన అనంతరం చైతూ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఇందులో ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మలయాళ నటుడు జయరాం కీలకపాత్రలో నటిస్తున్నారు. సుకుమార్తో కలిసి ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, దీనికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
ఇక అర్జున్ అనే మరో మూవీలోనూ నాగచైతన్య నటిస్తున్నారు. ఇందులో ఆయన స్టైలిష్, పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ను ఇటీవలే విడుదల చేశారు. అతీంద్రియ శక్తులను అర్జున్ ఎలా ఎదిరించాడు ? అనే కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని గ్లింప్స్ను చూస్తే అర్థమవుతోంది. భారీ విజువల్స్, గ్రాండ్ బీజీఎం, స్పెషల్ ఎఫెక్ట్స్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.












