దోమ‌లు ఎక్కువ‌గా ఎవ‌రిని కుడ‌తాయో తెలుసా ?

July 24, 2021 8:42 PM

వ‌ర్షాకాలం వచ్చిందంటే చాలు దోమ‌లు మ‌న‌పై దండ‌యాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమ‌లు ఎవ‌రిని ప‌డితే వారిని కుట్ట‌వ‌ట‌. కేవ‌లం కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్న‌వారినే ఎక్కువగా కుడ‌తాయ‌ట‌. మ‌రి వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందామా..!

why mosquitoes bite some people only

* మ‌నం ఆక్సిజ‌న్‌ను పీల్చుకుని కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను విడిచి పెడతాం క‌దా. అయితే దోమ‌లు మ‌నం వ‌దిలే కార్బ‌న్ డ‌యాక్సైడ్ కు ఎక్కువ‌గా ఆకర్షిత‌మ‌వుతాయి. అందుక‌నే అవి మ‌న‌ల్ని కుడ‌తాయి.

* కొంద‌రి శ‌రీరాల నుంచి చెమ‌ట దుర్వాస‌న వ‌స్తుంటుంది. అలాంటి వారిని కూడా దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయి.

* మ‌న శ‌రీరం నుంచి వ‌చ్చే వేడిని గ్ర‌హించి దోమ‌లు మ‌న‌ల్ని కుడ‌తాయి. వేడి శ‌రీరం ఉన్న‌వారిని ఎక్కువ‌గా కుడ‌తాయి.

* అధిక బ‌రువు ఉన్న‌వారిని కూడా దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌.

* O గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారిని కూడా దోమ‌లు ఎక్కువగా కుడ‌తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment