రూ.13,999కే పోకో నుంచి కొత్త 5జి ఫోన్‌..!

June 9, 2021 2:04 PM

మొబైల్స్ త‌యారీదారు పోకో త‌క్కువ ధ‌ర‌కే ఓ నూత‌న 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో తాజాగా విడుద‌ల చేసింది. పోకో ఎం3 ప్రొ 5జి పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది.

POCO M3 Pro 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది.

పోకో ఎం3 ప్రొ 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
  • హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • డ్యుయ‌ల్ 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

పోకో ఎం3 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ప‌వ‌ర్ బ్లాక్‌, కూల్ బ్లూ, పోకో ఎల్లో క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.13,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూన్ 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో విక్ర‌యిస్తారు. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్ల‌ను రూ.500 త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. దీని వ‌ల్ల ఈ ఫోన్ రెండు వేరియెంట్ల‌ను రూ.13,499, రూ.15,499 ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now