రూ.50 కోట్ల‌ను పోగొట్టుకున్న సాయిప‌ల్ల‌వి.. ఎందుక‌లా..?

August 6, 2022 4:30 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయం అవుతుంటారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్  చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేకత గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి.

ఫిదా చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అభినయంతోనే అనేకమంది అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి. తను చేసే చిత్రాలలో పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే హీరోయిన్ సాయి పల్లవి. తనకంటూ ఒక బౌండరీ గీసుకొని, ఎంత డబ్బు ఎర చూపినా కూడా తల వంచకుండా ఆమె అనుకున్న పని చేసే తీరుతుంది. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా తనకు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నిరాకరిస్తుంది.

sai pallavi reportedly lost rs 50 crores for losing movies

ఎంత మంచి కథ, బడా నిర్మాణ సంస్థ అయినా కూడా గ్లామ‌ర్ షోకి నో చెబుతూ నిర్మొహమాటంగా ఎన్నో అవకాశాలను వదిలేసింది. సాయి పల్లవి తరహా చూస్తే ఖచ్చితంగా ఈ కాలం ఉండాల్సిన‌ అమ్మాయి అయితే కాదు. ఇప్పటి తరం హీరోయిన్స్ తో పోలిస్తే ఆ స్పీడ్, వాళ్ల స్టైల్ సాయి పల్లవిలో లేవనే చెప్పవచ్చు. ఈమె పద్ధతులు, ఆచరణలు అంజలీదేవి, రాజసులోచన కాలంనాటి తారల‌ను గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలతో వరుస పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

చిరంజీవి లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పి ఎక్కడ కూడా ఏమాత్రం భయం లేకుండా తన పని తను చేసుకుపోతోంది. సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా తనకంటూ రూ.10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోలేదు. అంతేకాకుండా ఆమె సిద్ధాంతాల ద్వారా కేవలం దర్శకుడు చెప్పినట్లు నటించాలనే రూల్స్ ను బ్రేక్ చేసింది సాయిపల్లవి. వచ్చిన అవకాశాలని వదులుకుంటూ దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టపోయిందని సినిమా వర్గాలలో టాక్ వినిపిస్తోంది. వచ్చిన మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఆమె కెరీర్ ని ప్రశ్నార్థకం చేసుకుంటుంద‌ని.. వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ముందు ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment