Anasuya : జ‌బ‌ర్ద‌స్త్ కు అన‌సూయ క‌న్నీటి వీడ్కోలు.. టీమ్ స‌భ్యులు బ‌తిమాలినా విన‌లేదు..

July 24, 2022 4:41 PM

Anasuya : బుల్లితెరపై ఎంతో స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగుతున్న‌ షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టి. ఈ షోకు ఎంతో మంది క‌మెడియ‌న్లు వ‌చ్చి వెళ్లిపోయారు. అయితే నాగ‌బాబు వెళ్లిన త‌రువాత మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కు జ‌బ‌ర్ద‌స్త్ లో ఒక భారీ కుదుపు వ‌చ్చేసింది. రోజా, త‌రువాత కమెడియ‌న్లు ఆది, సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను.. ఇలా అంద‌రూ వ‌రుస పెట్టి జ‌బ‌ర్ద‌స్త్‌కు వీడ్కోలు ప‌లికారు. అయితే కిరాక్ ఆర్‌పీ ఈమ‌ధ్య కాలంలో చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. దీంతో కొంద‌రు ఆర్‌పీని స‌పోర్ట్ చేయ‌గా.. కొంద‌రు మాత్రం మ‌ల్లెమాల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక ఇదిలా ఉండ‌గా.. తాజాగా అన‌సూయ కూడా జ‌బ‌ర్దస్త్‌కు అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె వీడ్కోలు ఎపిసోడ్ త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది.

ఇక వీడ్కోలు ఇస్తున్న సంద‌ర్భంగా అన‌సూయ పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో టీమ్ స‌భ్యులు అన‌సూయ‌ను బ‌తిమాలారు. నెల‌లో మూడు రోజులు అయినా స‌మ‌యం కేటాయించ‌లేవా.. అని అడిగారు. అందుకు అన‌సూయ క‌ష్ట‌మ‌ని స‌మాధానం చెప్పింది. దీంతో క‌న్నీటితో ఆమెకు వీడ్కోలు ప‌లికారు. జ‌డ్జి ఇంద్ర‌జ కూడా భావోద్వేగానికి గురైంది. అలాగే టీమ్ స‌భ్యులు కూడా జ‌బ‌ర్ద‌స్త్ ప‌ర్మినెంట్ అని.. ఎంతో మంది వ‌స్తుంటారు, పోతుంటార‌ని అన్నారు. ఇక అన‌సూయ జూన్ నెల‌లోనే తాను జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప‌రోక్షంగా చెప్పింది.

Anasuya said final good bye to Jabardasth
Anasuya

తాను త‌న కెరీర్‌లో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని.. ఇక‌పై కూడా మీ మ‌ద్ద‌తు నాకు ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని.. గ‌త నెల‌లో అన‌సూయ తెలియ‌జేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెడుతుంద‌ని.. అందుక‌నే అలాంటి కామెంట్స్ చేసింద‌ని అన్నారు. అయితే అదే నిజ‌మైంది. ఆమె అధికారికంగా ఈ షోకు వీడ్కోలు ప‌లికింది. ఆమెకు సినిమాల్లో ఆఫ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని తెలిసింది. క‌నుక‌నే ఇక‌పై టీవీ షోల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ప్ర‌ముఖ యాంకర్‌గా పేరున్న అన‌సూయ కూడా వెళ్లిపోవ‌డంతో ఇక జ‌బ‌ర్ద‌స్త్‌కు ఉన్న ఇంకాస్త క‌ళ కూడా త‌ప్పిన‌ట్లే అని అంటున్నారు. మ‌రి రేటింగ్స్ ఎలా వ‌స్తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now