వామ్మో.. అగ్గిపుల్లలతో సైకిల్.. వైరల్ గా మారిన ఫోటో..

June 5, 2021 6:42 PM

సైకిల్ తయారు చేయాలంటే ఎన్నో వస్తువులు కావాలి. కానీ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి వస్తువులతో పనిలేదు. తమ మనసులో ఏదైనా ఆలోచన మెదిలితే చాలు వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తారు. ఈ విధమైన ఆలోచన చేసిన వారిలో ఒడిశాకు చెందిన ఈ కళాకారుడే నిదర్శనం అని చెప్పవచ్చు.తనకు వచ్చిన విభిన్నమైన ఆలోచనను ఉపయోగించి ఏకంగా అగ్గిపుల్లలతో సైకిల్ నమూనాలు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఏకంగా 3653 అగ్గిపుల్లలను ఉపయోగించి ఈ కళాకారుడు పెన్నీ ఫార్తింగ్ సైకిల్’ నమూనా తయారు చేశాడు.1870లో ఉండే ఈ సైకిల్ కు రెండు చక్రాలు సమానంగా ఉండవు. ఒకటి పెద్దగా ఉంటే మరొకటి చిన్నదిగా ఉంటుంది. 50 ఇంచుల పొడవు, 25 ఇంచుల వెడల్పు గల ఈ సైకిల్ ను పూరీకి చెందిన శాశ్వత్ రంజన్ సాహూ కేవలం 7 రోజులలోనే పూర్తి చేశాడు.

ప్రస్తుతం ఈ సైకిల్ నమూనా కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాహూ మాట్లాడుతూ… స్కూలు చదువుకునే రోజుల్లోనే ఈ సైకిల్ గురించి విన్నాను, ఎలాగైనా ఈ సైకిల్ తొక్కాలంటే ఆశ తనకు ఉండేదని అయితే ప్రస్తుతం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈ సైకిల్ నమూనాను తయారు చేసినట్లు తెలిపారు. మరింకెందుకాలస్యం ఇంత అద్భుతమైన ఈ ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now