Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకుల‌పై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన స‌మంత‌.. ఏం చెప్పిందంటే..?

July 21, 2022 10:24 PM

Samantha : గ‌తేడాది అక్టోబ‌ర్ మొద‌టి వారంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అందరూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల గురించి అంద‌రికీ తెలిసిందే. స‌మంతనే కావాల‌ని చైతూకు విడాకులు ఇచ్చింద‌ని.. ఆమెకు సినిమాల్లో చేయ‌డం అంటేనే ఇష్ట‌మ‌ని.. భ‌ర్త అంటే ప్రేమ లేద‌ని.. ఆమెకు పిల్ల‌ల్ని క‌నే ఉద్దేశం లేద‌ని.. అబార్ష‌న్లు జ‌రిగాయని.. ఇలా ర‌క‌ర‌కాలుగా ఆమెపై వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఓ ద‌శ‌లో అయితే నాగ‌చైత‌న్య ఇస్తాన‌న్న రూ.250 కోట్ల భ‌ర‌ణాన్ని కూడా స‌మంత కాద‌నుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిన్నింటికీ ఎట్టకేల‌కు స‌మంత స‌మాధానాలు చెప్పింది. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హించిన కాఫీ విత్ క‌ర‌ణ్ షో సీజ‌న్ 7 ఎపిసోడ్ 3కు స‌మంత‌.. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా క‌ర‌ణ్ జోహార్ ఆమెను ఆమె వైవాహిక జీవితానికి చెందిన ప్ర‌శ్న‌ల‌ను అడిగారు. అయితే వాటికి ఎట్టకేల‌కు స‌మంత సమాధానాలు చెప్పింది.

Samantha finally told about her divorce with Naga Chaitanya
Samantha

నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది ? అని కరణ్ జోహర్ అడగ్గా.. విడాకుల తరువాత చాలా కష్టంగా మారిందని తెలియ‌జేసింది. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాన‌ని సమంత రిప్లై ఇచ్చింది. తామిద్దరం విడిపోవడం సామరస్యంగా జరగలేదని.. విడిపోయిన తరువాత చాలా మనోవేదనకు గురైనట్లు తెలియ‌జేసింది. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని.. భవిష్యత్‌లో ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేమ‌ని తెలిపింది.

ఇక చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్న తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను వెల్లడించి విడిపోయా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు.. అంటూ సమంత తెలిపింది.

అయితే అప్ప‌ట్లో విడాకుల కోసం రూ.250 కోట్ల‌ భరణం తీసుకుందని వచ్చిన వార్తలపై కూడా సమంత సమాధానం ఇచ్చింది. నాకు భరణంగా రూ.250 కోట్లు వచ్చిందని పుకార్లు వచ్చాయి. అయితే అది ఎంత అబద్ధ‌మో మీడియానే గ్రహించింది. చివ‌ర‌కు ఆ అబ‌ద్దాలు వాటంత‌ట అవే వీగిపోయాయి.. అని స‌మంత తెలియ‌జేసింది.

ఇక 2009లో ఏ మాయ చేశావె సినిమా ద్వారా నాగ చైతన్యతో సమంతకు పరిచయం అయింది. తరువాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న వీరు వివాహం చేసుకున్నారు. త‌రువాత 4 ఏళ్ల‌ పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి నుంచి నాగ చైతన్య గురించి స‌మంత ఎప్పుడూ మాట్లాడ‌లేదు. కానీ తాజాగా విష‌యాల‌ను వెల్ల‌డించింది. దీంతో ఈమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment