రోజూ రావి చెట్టు నీడన నిలబడితే ఏ దోషాలు ఉండవు..!

March 1, 2022 12:20 PM

భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఆ దేవతా వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం చేస్తుంటాము. ఈ విధంగా చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భావిస్తారు. ఇందులో భాగంగానే రావి చెట్టును హిందువులు సాక్షాత్తూ విష్ణు స్వరూపం అని భావిస్తారు. ఈ రావిచెట్టునే అశ్వత్థ వృక్షం, బోధివృక్షం అని కూడా పిలుస్తారు.

రోజూ రావి చెట్టు నీడన నిలబెడితే ఏమవుతుందో తెలుసా?

విష్ణు స్వరూపంగా పిలువబడే ఈ రావిచెట్టు మొదట్లో విష్ణువు బోదలో, కేశవుడు శాఖలో, నారాయణుడు పత్రాలలో, హరి ఫలాల్లో, సర్వ దేవ సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారనీ చెబుతారు. అదేవిధంగా సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే కనుక దీనిని బోధి వృక్షం అని కూడా పిలుస్తారు.

కుటుంబంలో కలహాలు ఉన్న దంపతులు లేదా సంతానం లేని వారు రావిచెట్టు, వేపచెట్టును పూజించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండటమే కాకుండా, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రతి రోజూ రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు నీడలో నిలబడితే వారికి శని దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment