Brahmanandam : కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం ప్రత్యేక బహుమతి..!

October 31, 2021 4:35 PM

Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన కామెడీ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బ్రహ్మానందం.. నటుడు కృష్ణంరాజు దంపతులను కలిశారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్య కారణంగా శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Brahmanandam special gift to krishnam raju couple

అనంతరం బ్రహ్మానందం తను స్వయంగా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని కృష్ణంరాజు దంపతులకు బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాకుండా.. మంచి కళాకారుడు కూడా అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

అదేవిధంగా బ్రహ్మానందం కృష్ణంరాజు దంపతులకు మంచి బహుమతిని అందించినందుకు బ్రహ్మానందంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో బ్రహ్మానందం స్వయంగా తాను గీసిన చిత్రాలను అల్లు అర్జున్, రానాకి కూడా ప్రత్యేకంగా పంపించారు. ఇక బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రంగమార్తాండ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment