T20 World Cup 2021 : శ్రీ‌లంక‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా..!

October 28, 2021 10:52 PM

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 22వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై కంగారూలు 7 వికెట్ల తేడాతో గెలుపొందారు.

T20 World Cup 2021 australia won by 7 wickets against srilanka in 22nd match

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. శ్రీ‌లంక బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక బ్యాట్స్‌మెన్ల‌లో కుశాల్ పెరీరా, చ‌రిత్ అస‌లంక‌, భానుక రాజ‌ప‌క్స‌లు రాణించారు. కుశాల్ పెరీరా 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 ప‌రుగులు చేయ‌గా, చ‌రిత అస‌లంక 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 35 ప‌రుగులు చేశాడు. భానుక రాజ‌ప‌క్స 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌, ఆడం జంపాలు త‌లా 2 వికెట్లు తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 155 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ 42 బంతుల్లో 10 ఫోర్ల‌తో 65 ప‌రుగులు చేసి రాణించ‌గా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ 26 బంతుల్లో 1 ఫోర్‌తో 28 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ డిసిల్వా 2 వికెట్లు తీయ‌గా, ద‌సున్ శ‌న‌క 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now