నెలకు 16 వేల స్టయిపెండ్.. రూ 50వేల అలవెన్స్.. డిగ్రీ పాసైన వారు అర్హులు!

April 24, 2021 11:50 AM

భారత ప్రభుత్వరంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2021 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్ కి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://youthforindia.org/ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఫెలోషిప్ అర్హత పొందటానికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులు పై అవగాహన ఉండాలి. ఈ ఏడాది ఫెలోషిప్ 100 కి పైగా ఖాళీలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన ఈ ఫెలోషిప్ 13 నెలలపాటు ఉంటుంది.

ఈ ఫెలోషిప్ అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని రోజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఫెలోషిప్ ద్వారా నివాస ఖర్చులకోసం నెలకు 15 వేలు, రవాణా ఖర్చులకు వెయ్యి రూపాయలు, అలవెన్సులు కింద 50000, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 30 2021.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment