రద్దీగా ఉండే బస్సులు లేదా రైళ్లలో సీటు దొరకడం అంటే కష్టమే. ప్రారంభం అయ్యే స్టేషన్లో మాత్రమే మనకు సీట్లు దొరుకుతాయి. మధ్యలో ఎక్కితే చివరి వరకు నిలబడాల్సిందే. మన అదృష్టం బాగుంటే సీట్ దొరుకుతుంది. లేదంటే ప్రయాణం పూర్తయ్యే వరకు కాళ్లకు పని చెప్పాల్సిందే. అయితే అలాంటి స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఓ చిన్న ట్రిక్ ప్రయోగించి సీటును దక్కించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఓ సారి లుక్కేయండి.
ఢిల్లీ మెట్రో రైలులో జరిగిందీ ఘటన. రైలులో రద్దీగా ఉండడంతో కొందరు నిలబడ్డారు. అయితే ఓ యువకుడు మాత్రం ఫిట్స్ వచ్చినట్లు నటించాడు. దీంతో అతని ఎదురుగా సీట్లలో ఉన్నవారు సీట్లు ఖాళీ చేశారు. అది గమనించిన ఆ యువకుడు వెంటనే కూర్చోలేదు. కానీ కూర్చున్నాక మళ్లీ ఫిట్స్ వచ్చినట్లు చేశాడు. దీంతో చుట్టూ చూస్తున్న వారు అతనికి ఏమైందా ? అని కంగారు పడ్డారు.
అయితే అతను సీట్ కోసమే అలా చేశాడని అతన్ని చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. రైలులో సీటు దక్కించుకోవడం కోసమే అతను అలా చేశాడని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్ని చాలా చీప్ ట్రిక్ అని అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…