పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన కేరళలో ఉన్నఫలంగా ఓ దీవి ప్రత్యక్షమైంది. చూడడానికి చుట్టూ పచ్చని వాతావరణంతో పాటు ఎగిసిపడుతున్న అరేబియా సముద్రపు అలలు చూపరులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ విధమైనటువంటి అందమైన ప్రదేశంలో ఉన్నఫలంగా ఒక దీవి పుట్టుకొచ్చింది. ఇన్నిరోజులు ఎక్కడ ఉందో తెలియని దీవి తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమవడంతో అందరి చూపు ఈ దీవి పైనే పడింది.
కోచీకి పశ్చిమ తీరంలో ఉన్న ఈ దీవి గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ టీవీ సముద్రపు అడుగున ఉండటంవల్ల ఈ దీవి గురించి ఎవరికీ అవగాహన లేదు. తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమైన ఈ దీవి కొత్తగా ఏర్పడినదా లేక సముద్ర మట్టాలు పెరగడం వల్ల కనుమరుగైపోయినదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దీవికీ సంబంధించిన ఫోటోలను ‘చెల్లనం కర్షిక టూరిజం డిపార్ట్మెంట్’ అధ్యక్షుడు జావియర్ జులప్పన్ కలిప్పరంబిల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో చర్చనీయమైంది.
చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి ఈ దీవీ సముద్ర తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.అయితే ఈ దీవి గురించి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ.. ఈ విధమైనటువంటి దీవిని మేము కూడా గూగుల్ మ్యాప్ లోనే చూశాము. అయితే ఇది ఏ విధంగా ఏర్పడింది అనే విషయం గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని,పూర్తి పరిశోధన తరువాతే ఈ దీవి ఏ విధంగా ఏర్పడిందో తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ దీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…