కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ను విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల పెళ్లిళ్ల వంటి శుభ కార్యాలకు పరిమిత సంఖ్యలో అతిథులతో అనుమతులు ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఆ కార్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. అయితే శుభ కార్యాలకు అనుమతులు ఉన్న చోట్లలో అనుమతి ఇచ్చిన సంఖ్యలో కాకుండా కొన్ని చోట్ల భారీ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది. అయితే అక్కడ మాత్రం పోలీసులు అతిథులకు వింతైన శిక్ష విధించారు.
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా ఉమరై గ్రామంలో తాజాగా ఓ పెళ్లి జరిగింది. అయితే ఆ వేడుకకు ఏకంగా 300 మందికి పైగా అతిథులు వచ్చారు. కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ కొందరు మాత్రం పోలీసులకు చిక్కారు.
తమ చేతికి చిక్కిన కొంత మందిచే పోలీసులు కప్ప గంతులు వేయించారు. ఎవరైనా ఆ గంతులు వేయకపోతే వారిని పోలీసులు లాఠీలతో బెదిరించారు. దీంతో వారు గంతులు వేయకతప్పలేదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…