కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ను విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల పెళ్లిళ్ల వంటి శుభ కార్యాలకు పరిమిత సంఖ్యలో అతిథులతో అనుమతులు ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఆ కార్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. అయితే శుభ కార్యాలకు అనుమతులు ఉన్న చోట్లలో అనుమతి ఇచ్చిన సంఖ్యలో కాకుండా కొన్ని చోట్ల భారీ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది. అయితే అక్కడ మాత్రం పోలీసులు అతిథులకు వింతైన శిక్ష విధించారు.
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా ఉమరై గ్రామంలో తాజాగా ఓ పెళ్లి జరిగింది. అయితే ఆ వేడుకకు ఏకంగా 300 మందికి పైగా అతిథులు వచ్చారు. కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ కొందరు మాత్రం పోలీసులకు చిక్కారు.
తమ చేతికి చిక్కిన కొంత మందిచే పోలీసులు కప్ప గంతులు వేయించారు. ఎవరైనా ఆ గంతులు వేయకపోతే వారిని పోలీసులు లాఠీలతో బెదిరించారు. దీంతో వారు గంతులు వేయకతప్పలేదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…