వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితిలో ఆరు బయట ఎవరైనా ఉంటే వారిపై పిడుగులు పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎత్తైన నిర్మాణాలు, వృక్షాలపై పిడుగులు పడుతుంటాయి. కానీ అస్సాంలో పిడుగులు పడడం వల్ల ఒకేసారి ఏకంగా 18 ఏనుగులు చనిపోయాయంటూ ప్రచారం జరుగుతోంది. ఏనుగులు చనిపోయిన మాట వాస్తవమే కానీ.. అందుకు పిడుగులే కారణమా, ఇంకేదైనా ఉందా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అస్సాంలోని బాముని కొండ ప్రాంతంలో కొందరికి 18 ఏనుగుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయగా వారు అలర్ట్ అయ్యి ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఒకేసారి అంత ఎక్కువ సంఖ్యలో ఏనుగులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏనుగుల మరణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఏనుగులు చనిపోయేందుకు పిడుగులు పడడమే కారణమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. అయితే నిజానికి ఏనుగులు, జిరాఫీల వంటి భారీ జంతువులపై పిడుగులు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక చోట పిడుగు పడితే అక్కడికి సమీపంలోని జంతువులకు భూమి గుండా విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుందని, అలాంటి స్థితిలోనూ ఆ జంతువులు చనిపోతాయని అంటున్నారు.
ఇక ఏవైనా ఎత్తయిన వస్తువులపై పిడుగులు పడినప్పుడు వాటిని పట్టుకుని ఏవైనా జంతువులు ఉంటే అవి చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. కానీ ఏనుగుల మృతికి పిడుగులే కారణమా అనే విషయం తెలియలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…