వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితిలో ఆరు బయట ఎవరైనా ఉంటే వారిపై పిడుగులు పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎత్తైన నిర్మాణాలు, వృక్షాలపై పిడుగులు పడుతుంటాయి. కానీ అస్సాంలో పిడుగులు పడడం వల్ల ఒకేసారి ఏకంగా 18 ఏనుగులు చనిపోయాయంటూ ప్రచారం జరుగుతోంది. ఏనుగులు చనిపోయిన మాట వాస్తవమే కానీ.. అందుకు పిడుగులే కారణమా, ఇంకేదైనా ఉందా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అస్సాంలోని బాముని కొండ ప్రాంతంలో కొందరికి 18 ఏనుగుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయగా వారు అలర్ట్ అయ్యి ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఒకేసారి అంత ఎక్కువ సంఖ్యలో ఏనుగులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏనుగుల మరణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఏనుగులు చనిపోయేందుకు పిడుగులు పడడమే కారణమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. అయితే నిజానికి ఏనుగులు, జిరాఫీల వంటి భారీ జంతువులపై పిడుగులు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక చోట పిడుగు పడితే అక్కడికి సమీపంలోని జంతువులకు భూమి గుండా విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుందని, అలాంటి స్థితిలోనూ ఆ జంతువులు చనిపోతాయని అంటున్నారు.
ఇక ఏవైనా ఎత్తయిన వస్తువులపై పిడుగులు పడినప్పుడు వాటిని పట్టుకుని ఏవైనా జంతువులు ఉంటే అవి చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. కానీ ఏనుగుల మృతికి పిడుగులే కారణమా అనే విషయం తెలియలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…