భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే మోడీపై ఉన్న అభిమానంతో పూణె ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ మొండే ఆయనకు గుడి కట్టించడమేకాకుండా ఆ గుడిలో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ విధంగా మోడీకి కట్టించిన ఆలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
కాగా ఆలయంలో ప్రతిష్టించిన మోడీ విగ్రహాన్ని రెండు రోజులు కూడా గడవకముందే రాత్రికి రాత్రి చోరీ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం పట్ల పట్ల ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విగ్రహం ప్రతిష్టించిన 72 గంటలు కూడా కాకముందే ఈ విగ్రహం చోరీకి గురవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన మయూర్ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ అతని ఫోన్ స్విచాఫ్ వస్తుండడం గమనార్హం. అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ విగ్రహాన్ని తొలగించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో మయూర్ ఇంధనం ధరలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల డబ్బులు జమ అవుతాయని చెప్పడం పలు విమర్శలకు కారణమయింది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ విగ్రహాన్ని దొంగతనం చేసినట్లు తెలియడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…