భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే మోడీపై ఉన్న అభిమానంతో పూణె ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ మొండే ఆయనకు గుడి కట్టించడమేకాకుండా ఆ గుడిలో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ విధంగా మోడీకి కట్టించిన ఆలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
కాగా ఆలయంలో ప్రతిష్టించిన మోడీ విగ్రహాన్ని రెండు రోజులు కూడా గడవకముందే రాత్రికి రాత్రి చోరీ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం పట్ల పట్ల ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విగ్రహం ప్రతిష్టించిన 72 గంటలు కూడా కాకముందే ఈ విగ్రహం చోరీకి గురవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన మయూర్ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ అతని ఫోన్ స్విచాఫ్ వస్తుండడం గమనార్హం. అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ విగ్రహాన్ని తొలగించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో మయూర్ ఇంధనం ధరలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల డబ్బులు జమ అవుతాయని చెప్పడం పలు విమర్శలకు కారణమయింది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ విగ్రహాన్ని దొంగతనం చేసినట్లు తెలియడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…