ప్రస్తుత కాలంలో అటవీ ప్రాంతాలు పూర్తిగా అంతరించడంతో అడవిలో నివసించే జంతువులు ఆహారం కోసం గ్రామాలలో సంచరించడం మనం చూస్తున్నాము. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసింది ఈ క్రమంలోనే వారు వారి చేతిలో ఉన్నటువంటి బర్త్ డే కేక్ చిరుత పై విసిరి ప్రాణాలను కాపాడుకున్నారు.
ఫిరోజ్, సబీర్ అన్నదమ్ములలో ఫిరోజ్ కుమారుడి పుట్టినరోజు ఉండడంతో వీరిద్దరూ కలిసి ద్విచక్రవాహనం పై బుర్హాపూర్లో కేక్ తీసుకొని తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఓ చెరుకు తోట నుంచి చిరుత పులి బయటకు వచ్చే వారిపై దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చిరుత సుమారు 500 మీటర్ల వరకు వారిని వెంబడించింది.
చిరుత దాడి నుంచి తప్పించుకోవడం కోసం తమ్ముడు సబీర్ తన చేతిలో ఉన్న బర్తడే కేకును చిరుత మొహంపై విసిరాడు. దీంతో చిరుత అక్కడే ఆగిపోవడంతో బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడి నుంచి ఎంతో వేగంగా తమ గ్రామానికి చేరుకున్నారు. ఈ విధంగా ఈ అన్నదమ్ములు ఇద్దరి ప్రాణాలను కేవలం బర్త్డే కేక్ కాపాడిందని చెప్పవచ్చు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…