ప్రస్తుత కాలంలో అటవీ ప్రాంతాలు పూర్తిగా అంతరించడంతో అడవిలో నివసించే జంతువులు ఆహారం కోసం గ్రామాలలో సంచరించడం మనం చూస్తున్నాము. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసింది ఈ క్రమంలోనే వారు వారి చేతిలో ఉన్నటువంటి బర్త్ డే కేక్ చిరుత పై విసిరి ప్రాణాలను కాపాడుకున్నారు.
ఫిరోజ్, సబీర్ అన్నదమ్ములలో ఫిరోజ్ కుమారుడి పుట్టినరోజు ఉండడంతో వీరిద్దరూ కలిసి ద్విచక్రవాహనం పై బుర్హాపూర్లో కేక్ తీసుకొని తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఓ చెరుకు తోట నుంచి చిరుత పులి బయటకు వచ్చే వారిపై దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చిరుత సుమారు 500 మీటర్ల వరకు వారిని వెంబడించింది.
చిరుత దాడి నుంచి తప్పించుకోవడం కోసం తమ్ముడు సబీర్ తన చేతిలో ఉన్న బర్తడే కేకును చిరుత మొహంపై విసిరాడు. దీంతో చిరుత అక్కడే ఆగిపోవడంతో బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడి నుంచి ఎంతో వేగంగా తమ గ్రామానికి చేరుకున్నారు. ఈ విధంగా ఈ అన్నదమ్ములు ఇద్దరి ప్రాణాలను కేవలం బర్త్డే కేక్ కాపాడిందని చెప్పవచ్చు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…