Vastu Tips : వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మన పూర్వీకులు ఎంతో కాలం నుంచి వాస్తు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. వాస్తును పాటిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించవచ్చు. అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నా.. వారు రోజూ చేసే పలు పనుల కారణంగా కూడా వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. దీంతో ఇంట్లోని వారికి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుటుంబ యజమాని ఆర్థిక, ఆరోగ్య సమస్యల బారిన పడతారు. కనుక వాస్తు దోషాలకు కారణం అయ్యే పనులను చేయకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతుంటారట. కనుక ఆ సమయంలో మనం ఇంటిని ఊడ్చడం, తుడవడం వంటి పనులు చేయకూడదట. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి మన సంపదను పోయేలా చేస్తుందట. కనుక ఈ తప్పు చేయకండి. అలాగే ఇంటిని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా.. వారి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండవు. కనుక ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి. ఇల్లు లేదా ఇంటి పరిసరాలు గనక శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అలాంటి చోట్ల ఆమె ఉండదు. దీంతో మనకు డబ్బు సమస్యలు వస్తాయి. కనుక ఈ తప్పును కూడా చేయకండి.
ఇక కొందరు రోజూ చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఇలా లేస్తే దరిద్రం చుట్టుకుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్ర లేస్తే మంచిది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మనపై వరాల జల్లు కురిపిస్తుంది. అప్పుడు మనకు అదృష్టానికి, సంపదకు లోటు ఉండదు. ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. కనుక ఎవరికీ ఉప్పును చేతికి ఇవ్వకూడదు. సాయంత్రం అయిన తరువాత ఇతరులకు ఉప్పును అసలు ఇవ్వకూడదు. కనుక ఈ పొరపాటును కూడా చేయకూడదు. లేదంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అన్నీ సమస్యలే వస్తాయి. కనుక ఈ నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…