Nailing On Wall : మన పెద్దలు పూర్వకాలం నుంచి అనేక శాస్త్రాలను విశ్వసిస్తూ వస్తున్నారు. వాటిల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. ఎలాంటి దోషాలు కూడా ఏర్పడవని, ఆ ఇంటి సభ్యులు అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారని అంటారు. అందుకోసమే ఇంటిని నిర్మించేటప్పుడు లేదా కట్టి ఉన్న ఇంటిని కొనేటప్పుడు వాస్తు పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అయితే మీకు తెలుసా.. ఇంట్లో మనం చేసే చిన్న పనులు కూడా వాస్తు దోషాలకు, వాస్తు మార్పులకు కారణమవుతాయని. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఇంట్లో మనం అప్పుడప్పుడు గోడలకు మేకులు కొడుతుంటాం. మేకులకు ఏమైనా తగిలించుకోవచ్చని మనం మేకులను మనకు కావల్సిన గోడలకు కొడతాం. అయితే ఇలా గోడలకు మేకులు కొట్టడం అన్నది వాస్తు ప్రకారం మంచిదేనట. అవును, దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయని, కొత్త ఆదాయ మార్గాలు సమకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అయితే గోడలకు మేకులు కొట్టమన్నారు కదా అని అన్ని గోడలకు మేకులను కొట్టకూడదట. ఎందుకంటే ఇంట్లో కేవలం ఒకే దిశలో ఉన్న గోడకు మాత్రమే మేకులను కొట్టాలని, అప్పుడే పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలు పోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఏ దిశలో ఉన్న గోడకు మేకులను కొట్టాలంటే.. దక్షిణం వైపు ఉన్న గోడకు మనం మేకులను కొట్టాల్సి ఉంటుంది.
దక్షిణం దిశ యమధర్మరాజుకు చెందుతుంది. అందువల్ల ఈ దిశలో ఉన్న గోడలకు మాత్రమే మేకులను కొట్టాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. డబ్బు సమస్యలు ఉండవు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ తూర్పు వైపు ఉన్న గోడకు మేకులను కొట్టకూడదట. అలా చేస్తే ఇంట్లోకి ధారాళంగా నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుందట. ఇది అనేక సమస్యలను కలగజేస్తుందట. కనుక గోడలకు మేకులు కొట్టే విషయంలో వాస్తు ప్రకారం ఎవరైనా సరే ఈ సూచనను తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…