Lord Sri Krishna And Bhishma : పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువ ఏళ్ల పాటు జీవించే వారు. రాను రాను ఆయుర్దాయం తగ్గిపోతూ వస్తోంది. అప్పట్లో చాలా మంది 90 నుంచి 100 ఏళ్ల వరకు జీవించారు. తరువాత అది 70 నుంచి 80 కి తగ్గిపోయింది. ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్లకు ఆయుర్దాయం పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందని సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? ద్వాపర యుగంలో.. అంటే మహాభారత యుద్ధం సమయంలో.. ఆ కాలంలో ప్రజల వయస్సు చాలా ఎక్కువగా ఉండేదట. వారు సుమారుగా 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించేవారట. అవును, కొందరు నిపుణులు ఇదే విషయం చెబుతున్నారు.
అప్పట్లో ఒక వ్యక్తి సరాసరి ఆయుర్దాయం 120 నుంచి 150 ఏళ్లు ఉండేదట. ఇక మహాభారత యుద్ధం సమయంలో భీష్ముడి వయస్సు 170 ఏళ్లని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం అప్పటికి ఆయన వయస్సు 150 ఏళ్లు అని చెబుతారు. ఇక అదే సమయంలో కృష్ణుడి వయస్సుపై కూడా ఇప్పటికీ చాలా మంది వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు. మహాభారత యుద్ధం సమయం నాటికి కృష్ణుడి వయస్సు సుమారుగా 56 ఏళ్లు ఉంటుందని కొందరు అంటారు. కాదు, ఆయన వయస్సు 83 ఏళ్లు అని కొందరు అంటారు.
ఇక కృష్ణుడు తన 119వ ఏట అవతారం చాలించాడని చెబుతారు. అలాగే మహాభారత యుద్ధం జరిగే నాటికి అర్జునుడి వయస్సు సుమారుగా 55 ఏళ్లు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అప్పటికి, ఇప్పటికి సగటు మనిషి ఆయుర్దాయం చాలా వరకు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. అందుకు మనం పాటిస్తున్న అలవాట్లే కారణం అని చెప్పవచ్చు. అప్పట్లో వారు ఎంతో నిష్టగా ఉండేవారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ విషయంలో కఠినమైన నియమాలను పాటించేవారు. ఇక భీష్ముడు అయితే తండ్రి కోరిక మేరకు జీవితాంతం పెళ్లి చేసుకోనని కఠిన బ్రహ్మచర్యం పాటించాడు. అందుకనే ఆయన 150 ఏళ్లకు పైగా జీవించాడని చెబుతారు.
అయితే అప్పట్లో వారు పాటించిన అలవాట్లను గనుక మనం కూడా పాటిస్తే వారిలాగే మనం కూడా మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కచ్చితమైన ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం, పౌష్టికాహారం తీసుకోవడం, తగినన్ని నీళ్లను తాగడం వంటి నియమాలను పాటిస్తే మన ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మరి ఇవన్నీ ఇప్పటి ప్రజలకు సాధ్యమయ్యేవిలా మాత్రం కనిపించడం లేదు. కానీ ఎవరైనా ఇలాంటి జీవనవిధానాన్ని అలవాటు చేసుకుంటే వారు ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్లు జీవించవచ్చు. లేదంటే అనారోగ్యాల బారిన పడి త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…