Lord Sri Krishna And Bhishma : పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువ ఏళ్ల పాటు జీవించే వారు. రాను రాను ఆయుర్దాయం తగ్గిపోతూ వస్తోంది. అప్పట్లో చాలా మంది 90 నుంచి 100 ఏళ్ల వరకు జీవించారు. తరువాత అది 70 నుంచి 80 కి తగ్గిపోయింది. ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్లకు ఆయుర్దాయం పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందని సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? ద్వాపర యుగంలో.. అంటే మహాభారత యుద్ధం సమయంలో.. ఆ కాలంలో ప్రజల వయస్సు చాలా ఎక్కువగా ఉండేదట. వారు సుమారుగా 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించేవారట. అవును, కొందరు నిపుణులు ఇదే విషయం చెబుతున్నారు.
అప్పట్లో ఒక వ్యక్తి సరాసరి ఆయుర్దాయం 120 నుంచి 150 ఏళ్లు ఉండేదట. ఇక మహాభారత యుద్ధం సమయంలో భీష్ముడి వయస్సు 170 ఏళ్లని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం అప్పటికి ఆయన వయస్సు 150 ఏళ్లు అని చెబుతారు. ఇక అదే సమయంలో కృష్ణుడి వయస్సుపై కూడా ఇప్పటికీ చాలా మంది వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు. మహాభారత యుద్ధం సమయం నాటికి కృష్ణుడి వయస్సు సుమారుగా 56 ఏళ్లు ఉంటుందని కొందరు అంటారు. కాదు, ఆయన వయస్సు 83 ఏళ్లు అని కొందరు అంటారు.
ఇక కృష్ణుడు తన 119వ ఏట అవతారం చాలించాడని చెబుతారు. అలాగే మహాభారత యుద్ధం జరిగే నాటికి అర్జునుడి వయస్సు సుమారుగా 55 ఏళ్లు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అప్పటికి, ఇప్పటికి సగటు మనిషి ఆయుర్దాయం చాలా వరకు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. అందుకు మనం పాటిస్తున్న అలవాట్లే కారణం అని చెప్పవచ్చు. అప్పట్లో వారు ఎంతో నిష్టగా ఉండేవారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ విషయంలో కఠినమైన నియమాలను పాటించేవారు. ఇక భీష్ముడు అయితే తండ్రి కోరిక మేరకు జీవితాంతం పెళ్లి చేసుకోనని కఠిన బ్రహ్మచర్యం పాటించాడు. అందుకనే ఆయన 150 ఏళ్లకు పైగా జీవించాడని చెబుతారు.
అయితే అప్పట్లో వారు పాటించిన అలవాట్లను గనుక మనం కూడా పాటిస్తే వారిలాగే మనం కూడా మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కచ్చితమైన ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం, పౌష్టికాహారం తీసుకోవడం, తగినన్ని నీళ్లను తాగడం వంటి నియమాలను పాటిస్తే మన ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మరి ఇవన్నీ ఇప్పటి ప్రజలకు సాధ్యమయ్యేవిలా మాత్రం కనిపించడం లేదు. కానీ ఎవరైనా ఇలాంటి జీవనవిధానాన్ని అలవాటు చేసుకుంటే వారు ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్లు జీవించవచ్చు. లేదంటే అనారోగ్యాల బారిన పడి త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…