Lord Shani Dev : సనాతన ధర్మంలో ప్రతిరోజూ ఒక దేవుడికి, దేవతకి అంకింతం చేయబడిందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే శనివారం నాడు శని దేవునికి, శనిగ్రహ ఆరాధనకు అంకితం చేయబడింది. శని దేవున్ని కర్మ దాత అని కూడా అంటారు. మనం చేసే మంచి, చెడు పనులను శని దేవుడు గమనిస్తూ దానికి తగినట్టు మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలను, చెడు పనులు చేసే వారికి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు మన జీవితంలో అనూహ్యకరమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. దీంతో మనం అనేక కష్టనష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు శనివారం నాడు నష్టాలను ఎదుర్కొంటున్నవారు శనివారం నాడు శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శని దేవుని కోపం తగ్గి శనిదేవుని అనుగ్రహం మనపై ఉండాలంటే శనివారం నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.
శని దేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు శని యంత్రాన్ని పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శనిగ్రహం యొక్క చెడు ప్రభావంతో బాధపడే వారు శని యంత్రాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మాంసాహారం తీసుకోవడం మానేసి శక్తి మేరకు పేదలకు దానం చేయాలి. అలాగే శనివారం నాడు ఆవుకు నువ్వులను తినిపించాలి. అలాగే శనివారం నాడు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. దీనితో పాటు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తరువాత రావి చెట్టును తాకి నమస్కరించి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. ఇక అప్పుల బాధలతో బాధపడే వారు శనివారం నాడు నల్ల ఆవుకు బూందీ లడ్డూలను తినిపించాలి . నుదుటిపై కుంకుమ రాసి ఆవును పూజించాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఇక శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఆవనూనెలో ముఖాన్ని ముంచాలి. తరువాత ఈ నూనెను దానం చేయాలి. అలాగే శనివారం నాడు సాయంత్రం రావి చెట్టు కింద 9 ఆవనూనె దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి శని దేవుడిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే శనివారం నాడు ఎవరికీ చెప్పకుండా నువ్వులు, శనగపప్పు, నూనె, బెల్లం, నల్లబట్టలను దానం చేయాలి. ఇలా రహస్యంగా చేసే దానాలే మనకు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా శనివారం నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…