Pooja Room Vastu Tips : హిందువులు దేవతలను, దేవుళ్లను గుళ్లల్లోనే కాకుండా ఇంటిలో పూజ గదిని నిర్మించుకుని మరీ పూజిస్తూ ఉంటారు. ఇంటి పూజ గదిలో కుల దేవతలను, వారికి నచ్చిన దేవతా, దేవుడి ఫోటోలను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది మనసుకు ప్రశాంతతను కలిగించడంతో పాటు జీవితంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే ఎన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎంత ఆరాధించిన కొందరు ఎప్పటికి మనసును ప్రశాంతంగా ఉంచులేకపోతారు. అలాగే వారి జీవితంలో ఒక దాని తరువాత ఒకటి సమస్య వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే పూజ గది నిర్మాణంలో ఉన్న వాస్తు దోషాలు కూడా ఈ సమస్యలకు కారణం అవుతాయని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రంలో పూజ గది లేదా ఇంట్లో గుడి నిర్మించడానికి కొన్నినియమాలు ఉన్నాయి.
ఈ నియమాలను పాటించకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంట్లో అశాంతి, ధననష్టంతో పాటు ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. ఇంట్లో ఉండే పూజ గది విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు పెట్టకూడదు. చాలా మంది తెలిసి తెలియక లేదా అలంకరణ ప్రాయంగా చిన్న పెద్ద శంఖువులను ఉంచుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. కనుక ఇంట్లో పూజ గదిలో ఒక్క శంఖువును మాత్రమే ఉంచాలి. అలాగే చాలా మంది ఇంట్లో పూజ గదిలో మరణించిన పెద్దల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలను ఉంచుతారు. కానీ ఇలా చేయకూడదు. మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచితే ఇంట్లో కష్టాలు వస్తాయి.
మరణించిన వారి ఫోటోలను ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. అలాగే పూజ గదిలో విరిగిన విగ్రహాలను లేదా ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి విగ్రహాలను, ఫోటోలను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాగే పూజ గదిలో అస్థవ్యస్థంగా లేదా చెడు స్థితిలో ఉన్న దేవుడి ఫోటోలను ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వ్యక్తుల పురోగతి కూడా దెబ్బతింటుంది. అలాగే ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడికి సమర్పించిన పూలను మరుసటి తొలగించాలి. అలాగే పూజ సామాగ్రిని కూడా దేవుడి ఫోటోల దగ్గర ఉంచకూడదు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…