Vishalakshi Devi Temple In Kashi : పురాతన మరియు మతపరమైన నగరాల్లో కాశీ కూడా ఒకటి. కాశీ నగరంలో అమ్మవారి అధ్భుతమైన శక్తిపీఠం ఉంది. ఇక్కడ శక్తి పీఠాన్ని దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అటువంటి శక్తి ఆరాధన పీఠాలల్లో మాతా విశాలాక్షి ఆలయం కూడా ఒకటి. దేశవ్యాప్తంగా నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజభవనంలో ఒక యాగంలో తన భర్త చేసిన అవమానానికి బాధపడిన సతీదేవి అదే యాగశాలలో తన శరీరాన్ని వదిలివేసింది. ఆ తర్వాత శివుడు సతీదేవి మృతదేహంతో కల్యాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో సృష్టిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు.
మొత్తం 51 శక్తి పీఠాలు పరిగణించబడతాయి. పరమశివుడు భుజంపై సతీదేవిని పెట్టుకుని తిరుగుతున్నప్పుడు సతీదేవి కుడి చెవిపోగు, కుడి కన్ను పడిన ప్రదేశమే నేడు మాతా విశాలాక్షి యొక్క నివాసం కాశీగా ప్రసిద్ది చెందింది. అలాగే ఈ శక్తి పీఠాలన్నీ సందర్శించిన తరువాత శివుడు ధ్యానం చేసాడని అతని రూపం నుండే కాలభైరవుడిని సృష్టించాడని నమ్ముతారు. కాశీలోని ఈ శక్తి పీఠానికి దగ్గర్లోనే కాలభైరవుడు కూడా ఉన్నాడు. కాశీలో అమ్మవారైనటువంటి విశాలాక్షి దేవి శక్తిపీఠం కాశీలోని వంకర వీధుల మధ్య ఉంది. శివుడు రోజూ రాత్రి ఇక్కడే నిద్రిస్తాడని నమ్ముతారు. ఈ తల్లి దర్శనం కోసం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రుల్లో ఇక్కడ భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. కాశీలో ఉన్న విశాలాక్షి దేవిని దర్శించుకోవడం వల్ల రోగాలు, దుఃఖాలు దూరమవుతాయని అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు.
అలాగే వివాహం కుదరని మరియు వివాహంలో ఆటంకాలు ఉన్న అమ్మాయిలు వరుసగా 41 రోజుల పాటు మాతా విశాలాక్షిని దర్శించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి వివాహం జరుగుతుందని కూడా విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ మాతా విశాలాక్షి దేవి ఆలయం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఆలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి పూలమాలలు, పూలు, ప్రసాదాలతో పాటు అలంకరణ వస్తువులు కూడా సమర్పిస్తూ ఉంటారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…