Lakshmi Devi : జోతిష్య శాస్త్రంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానం చేయడం వల్ల మన జాతకంలో గ్రహాల ప్రభావం తగ్గుతుంది. దీంతో సమస్యల నుండి మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనం అవసరమైన వారికి వారి అవసరాన్ని బట్టి మాత్రమే దానం చేయాలి. విరాశాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే మనకు ఎక్కువ పుణ్యఫలితాలు లభిస్తాయి. అలాగే దానం చేసేటప్పుడు నిస్వార్థంగా, ఆనందంగా దానం చేయాలి. దుఃఖంతో, ద్వేషంతో చేసే దానాలకు ఎటువంటి ఫలితం ఉండదు. ఏది ఏమైనప్పటికి జోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. వీటిని దానం చేయడం వల్ల మనం పుణ్యానికి బదులుగా పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది.
అలాగే భగవంతుడి కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం మనం దానం చేయకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవనూనెను దానం చేయడం మంచిది. చాలా మంది ఆవనూనెను దానం చేస్తూ ఉంటారు. అయితే కొందరు వాడిన ఆవనూనెను కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంంచిది కాదు. పుణ్యానికి బదులు పాపం వస్తుంది. మనం శని దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే పసుపును సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడదు. పసుపును బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. కనుక గురువారం నాడు పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి బలహీనపడుతుంది. దీని వల్ల మనం జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా జోతిష్యశాస్త్రం ప్రకారం ఉప్పును కూడా దానం చేయవద్దు. ఉప్పును దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అలాగే పాత్రలను కూడా ఎప్పుడూ దానం చేయవద్దు. ఏ లోహంతో తయారు చేసిన పాత్రలను కూడా దానం చేయవద్దు. పాత్రలను దానం చేయడం వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. కుటుంబం యొక్క ఆనందం, శాంతి అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే పుణ్యం వస్తుందని చాలా మంది మత గ్రంథాలను దానంగా ఇస్తూ ఉంటారు. మత గ్రంథాలను దానం చేసేటప్పుడు పాత వాటిని, చిరిగిన వాటిని దానం చేయకూడదని గుర్తుంచుకోవాలి. చిరిగిన మత గ్రంథాలను దానం చేయడం వల్ల ఇంట్లోకి దురదృష్టం వస్తుందని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…