Lakshmi Devi : జోతిష్య శాస్త్రంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానం చేయడం వల్ల మన జాతకంలో గ్రహాల ప్రభావం తగ్గుతుంది. దీంతో సమస్యల నుండి మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనం అవసరమైన వారికి వారి అవసరాన్ని బట్టి మాత్రమే దానం చేయాలి. విరాశాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే మనకు ఎక్కువ పుణ్యఫలితాలు లభిస్తాయి. అలాగే దానం చేసేటప్పుడు నిస్వార్థంగా, ఆనందంగా దానం చేయాలి. దుఃఖంతో, ద్వేషంతో చేసే దానాలకు ఎటువంటి ఫలితం ఉండదు. ఏది ఏమైనప్పటికి జోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. వీటిని దానం చేయడం వల్ల మనం పుణ్యానికి బదులుగా పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది.
అలాగే భగవంతుడి కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం మనం దానం చేయకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవనూనెను దానం చేయడం మంచిది. చాలా మంది ఆవనూనెను దానం చేస్తూ ఉంటారు. అయితే కొందరు వాడిన ఆవనూనెను కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంంచిది కాదు. పుణ్యానికి బదులు పాపం వస్తుంది. మనం శని దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే పసుపును సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడదు. పసుపును బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. కనుక గురువారం నాడు పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి బలహీనపడుతుంది. దీని వల్ల మనం జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా జోతిష్యశాస్త్రం ప్రకారం ఉప్పును కూడా దానం చేయవద్దు. ఉప్పును దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అలాగే పాత్రలను కూడా ఎప్పుడూ దానం చేయవద్దు. ఏ లోహంతో తయారు చేసిన పాత్రలను కూడా దానం చేయవద్దు. పాత్రలను దానం చేయడం వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. కుటుంబం యొక్క ఆనందం, శాంతి అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే పుణ్యం వస్తుందని చాలా మంది మత గ్రంథాలను దానంగా ఇస్తూ ఉంటారు. మత గ్రంథాలను దానం చేసేటప్పుడు పాత వాటిని, చిరిగిన వాటిని దానం చేయకూడదని గుర్తుంచుకోవాలి. చిరిగిన మత గ్రంథాలను దానం చేయడం వల్ల ఇంట్లోకి దురదృష్టం వస్తుందని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…