Money Problems : హిందువులు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తుందని నమ్ముతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలనుకునే వారు శుక్రవారం చేసే పనులతో పాటు చేయకూడని పనులు కూడా ఉంటాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపంవచ్చి ఇంట్లో నుండి వెళ్లిపోతుందని మనం ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మనం లక్ష్మదేవి అసంతృప్తిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు మనం చేయకూడని పనులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు మాంసాహారాన్ని తినడం, మద్యపానం వంటివి చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శుక్రవారం నాడు మద్యపాన సేవనం, మాంసాహారాన్ని తీసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే జోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం నాడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అసభ్యపదజాలాన్ని వాడకూడదు. ఇది మీ ఖజానాను ఖాళీ చేస్తుంది. ఈ రోజున ఇతరులతో గొడవపడడం, తిట్టడం వంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. అదేవిధంగా శుక్రవారం నాడు దానం చేస్తే మంచిదని చాలా మంది నమ్ముతారు.
అయితే పొరపాటున కూడా శుక్రవారం నాడు ఈ వస్తువులను దానం చేయకూడదు. శుక్రవారం నాడు వెండి, పంచదార వంటి వాటిని దానం చేయడం వల్ల శుక్రగ్రహం బలహీనపడుతుంది. అలాగే శుక్రవారం నాడు ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు మరియు ఇతరుల నుండి డబ్బు తీసుకోకూడదు. ఇక శుక్రవారం నాడు వంటగదికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం రాకుండా పోతుంది. అలాగే శుక్రవారం నాడు చిరిగిన మరియు మురికి దుస్తులను ధరించకూడదు. ఇలా చేయడం వల్ల రాహువు బలహీనపడుతుంది. కనుక శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదని ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకతప్పదని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…