Chanakya Niti : ఆచార్య చాణక్యుడు… భారత సామ్రాజ్య స్థాపనలో ఆయనపాత్ర చాలా కీలకం. ఆచార్య చాణక్యుడుని కౌటిల్య మరియు విష్ణుగుప్త అని కూడా అంటారు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజైన చంద్రగుప్త మౌర్య యొక్క అత్యంత విశ్వసనీయ సలహాదారుడిగా మరియు మంత్రిగా చాణక్యుడు పరిగణించబడ్డాడు. చాణక్యుడు తన శాస్త్రీయ గ్రంథాల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య సూత్రాలను చాలా చక్కగా వివరించాడు. నేటికి ప్రజలు చాణక్యుడి విధానాలను అనుసరిస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇక చాణక్యుడు నరకంలో బాధించబడి ఆ తరువాత భూమిపై జన్మించిన వారిని వారి అలవాట్లను బట్టి మనం చాలా సులభంగా గుర్తించవచ్చని కూడా చెప్పారు.
అలాంటి వ్యక్తులు ఎక్కువగా చెడు అలవాట్లు కూడా కలిగి ఉంటారని కూడా అతను చెప్పాడు. ఇలా నరకంలో బాధింపబడి మరలా భూమిపై జన్మించిన వారిని ఎలా గుర్తించాలి.. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి విధానంలో వ్యక్తి యొక్క గుణాలు, అలవాట్లు, లోపాల గురించి ప్రత్యేక శ్రద్ద చూపించబడింది. అలాగే చాణక్యుడి ప్రకారం చాలా మంది నరకం నుండి వచ్చి భూమిపై జన్మించిన వారే. నరకం యొక్క బాధను అనుభవించి భూమిపై జన్మించిన వారిని వారి లోపాలను బట్టి గుర్తించవచ్చు. వారి మాటలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. అలాగే వారు ఎవరితో కూడా అంత ఎక్కువగా కలిసి ఉండరు. అలాగే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కూడా చక్కగా కలిసి ఉండరు.
వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు కూడా. ఇక చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం ఏడవ అధ్యాయం 16 వ శ్లోకంలో స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి లక్షణాల గురించి కూడా చెప్పబడింది. ఆచార్య చాణక్యుడి ప్రకారం స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి. వారు దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే దేవున్ని కూడా ఎక్కువగా పూజిస్తారు. అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా వారి లక్షణాలను బట్టి వారు స్వరంలో జీవించి మరలా జన్మించారా.. లేదా నరకంలో జీవించి భూమిపై మరలా జన్మించారా అన్న వివరాలను మనం సులభంగా తెలుసుకోవచ్చని చాణక్యుడు తెలియజేసాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…